Ranji Trophy: మధ్యప్రదేశ్ సరికొత్త రికార్డు.. తొలిసారి రంజీ ట్రోఫీ కైవసం
దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్ సత్తాచాటింది. ఈ ఏడాది రంజీ ట్రోఫీని ఆ రాష్ట్ర క్రికెట్ జట్టు సొంతం చేసుకుంది.
(ట్విటర్ సౌజన్యంతో..)
బెంగళూరు: దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్(Madhya pradesh) సత్తాచాటింది. ఈ ఏడాది రంజీ ట్రోఫీని ఆ రాష్ట్ర క్రికెట్ జట్టు సొంతం చేసుకుంది. క్రికెట్కు పవర్హౌస్లాంటి ముంబయి జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించి రంజీ చరిత్రలో తొలిసారి ట్రోఫీని దక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ముంబయిను 269 పరుగులకు కట్టడి చేసి, 108 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. కోచ్ చంద్రకాంత్ పండిట్కు ఇది ఆరో నేషనల్ టైటిల్.
మ్యాచ్ సాగిందిలా..!
ఈ ఏడాది రంజీ సెమీ ఫైనల్లో బెంగాల్ను ఓడించి మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్ను కట్టడి చేసి ముంబయి జట్టు ఫైనల్కు చేరాయి. జూన్ 22న మొదలైన ఫైనల్ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన ముంబయి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో 374 పరుగులకు ఆలౌట్ అయింది. సర్ఫరాజ్ ఖాన్ 134 (234 బంతుల్లో 13×4; 2×6) సెంచరీతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్లో భాగంగా బ్యాటింగ్కు దిగిన మధ్యప్రదేశ్ బ్యాట్స్మెన్స్ తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఓపెనర్ యశ్ దూబే 133 (336 బంతుల్లో 14×4) సహా శుభమ్ శర్మ 116 (215 బంతుల్లో 15×4; 1×6) రజిత్ పాటిదార్ 122 (219 బంతుల్లో 20×4) సెంచరీలతో అదరగొట్టగా, చివర్లో శరన్ష్ జైన్(57) అర్ధశతకంతో రాణించడంతో మధ్యప్రదేశ్ 536 పరుగుల భారీ స్కోరు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్లో భాగంగా బ్యాటింగ్కు దిగిన ముంబయి మరోసారి పేలవ ప్రదర్శనతో 269 పరుగులకు ఆలౌట్ అయింది. 108 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి మ్యాచ్ గెలవడమే కాకుండా తొలిసారి రంజీ ట్రోఫీని ముద్దాడింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా శుభమ్ శర్మ ఎంపికగా, ఈ సీజన్లో 1000 పరుగులకు పైగా చేసిన సర్ఫరాజ్ఖాన్ (ముంబయి) ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికయ్యాడు.
(ట్విటర్ సౌజన్యంతో..)
కన్నీటి పర్యంతమైన కోచ్ రవిచంద్రకాంత్ పండిత్
మధ్యప్రదేశ్ జట్టు రంజీ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో కోచ్ రవి చంద్రకాంత్ పండిత్ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. 1999లో ఆయన మధ్యప్రదేశ్ రంజీ జట్టు కెప్టెన్గా ఉన్న సమయంలో ఇదే చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయారు. దాదాపు 23ఏళ్ల తర్వాత చంద్రకాంత్ కోచ్గా వ్యవహరించిన మధ్యప్రదేశ్ జట్టు ట్రోఫీని కైవసం చేసుకోవడంతో స్టేడియంలోనే భావోద్వేగానికి గురయ్యారు. మధ్యప్రదేశ్ జట్టు రంజీ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. జట్టు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
భళా పంత్!
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!