Sachin - Arjun: దెబ్బ తగిలాక అర్జున్ మాట.. సచిన్ను గుర్తు చేసింది: యోగ్రాజ్
కెరీర్ తొలినాళ్లలోనే ఆటతో, క్రికెట్ పట్ల అంకితభావంతో ఎంతోమంది మనసుల్ని గెలుచుకున్నాడు సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar). అందులో ఒకటి ‘మై ఖేలేగా’ (Main Khelega). ఇదే మాట సచిన్ తనయుడు అర్జున్ (Arjun Tendulkar) నోట కూడా వచ్చిందట.
ఇంటర్నెట్ డెస్క్: లెజండరీ బ్యాటర్ సచిన్ తెందూల్కర్ తనయుడు అర్జున్ తెందూల్కర్ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. గోవా తరఫున రంజీ ట్రోఫీలోకి అడుగు పెట్టిన 23 ఏళ్ల అర్జున్ రాజస్థాన్తో తన మొదటి మ్యాచ్లోనే సెంచరీ బాదాడు. రంజీ ట్రోఫీ ప్రారంభానికి ముందు భారత మాజీ పేసర్ యోగ్రాజ్ సింగ్.. అర్జున్కు కొన్ని రోజులపాటు శిక్షణ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా శిక్షణ సమయంలో అర్జున్తో తన అనుభవాలను పంచుకున్నారు యోగ్రాజ్ సింగ్. అలాగే అర్జున్ సంకల్ప బలాన్ని, ఆటపట్ల చూపిస్తున్నఅంకితభావాన్ని మెచ్చుకున్నారు.
సచిన్ అభ్యర్థన మేరకు అర్జున్కు శిక్షణ ఇవ్వడానికి స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ పేసర్ యోగ్రాజ్ సింగ్ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అర్జున్కు ఆయన మెలకువలు నేర్పించారు. ఈ నేపథ్యంంలో అర్జున్ గురించి అసక్తికర విషయాలను యోగ్రాజ్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. శిక్షణ సమయంలో అర్జున్ నుంచి ఎదురైన ఒక సంఘటన తనకు సచిన్ను గుర్తు చేసిందని వెల్లడించారు.
ట్రైనింగ్ సెషన్లో బంతి వేగంగా వచ్చి అర్జున్ గడ్డానికి బలంగా తాకింది. దీంతో ముఖం బాగా వాచిపోయి, రక్తం కారడం మొదలైంది. అయినా, అర్జున్ విశ్రాంతి తీసుకోవడానికి అంగీకరించలేదట. ఆటను కొనసాగించడానికే మొగ్గుచూపాడని యోగ్రాజ్ తెలిపారు. ‘‘అర్జున్కు బంతి తగిలి గాయమవ్వడంతో.. ఐస్ పెట్టుకొని, విశ్రాంతి తీసుకో అని చెప్పాను. అయితే అతను మాత్రం.. ‘మై ఖేలేగా’ (నేను ఆడతాను) అంటూ ఆట కొనసాగించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ సమయంలో నాకు సచిన్ గుర్తొచ్చాడు. కెరీర్ తొలి రోజుల్లో ఓసారి సచిన్ ఇలానే అని ఆట కొనసాగించాడు’’ అంటూ నాటి రోజులు గుర్తు చేసుకున్నారు యోగ్రాజ్ సింగ్.
‘‘ఆ రోజు అర్జున్ మాటలు విని.. వెంటనే కౌగిలించుకొని డాక్టర్ దగ్గరకు వెళ్లమన్నాను. ఎందుకంటే అప్పటికే అర్జున్ ముఖం చాలా వాచింది. అయితే మరుసటి రోజే అతను శిక్షణకు హాజరయ్యాడు. అలా ఆట విషయంలో అతని సంకల్పబలం నాకు నచ్చింది’’ అని యోగ్రాజ్ మెచ్చుకున్నారు. దాంతోపాటు అర్జున్కు యోగ్రాజ్ ఓ సందేశం కూడా ఇచ్చారు. ‘‘అర్జున్..నువ్వు నీ సొంత దారిలో నడవాలి. అప్పుడే నువ్వు విజయం సాధించగలవు. ప్రజలూ నిన్ను గుర్తిస్తారు’’ అని చెప్పారు.
1989 నాటి ఘటన అదీ...
సచిన్ గురించి యోగ్రాజ్ చెప్పిన సంఘటన 1989లో జరిగింది. పాకిస్థాన్తో సచిన్ తొలి టెస్టు సిరీస్ ఆడుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. సియోల్కోట్లో జరిగిన నాలుగో టెస్టులో వకార్ యూనిస్ వేసిన బౌన్సర్ కారణంగా సచిన్ ముక్కుకు గాయమైంది. అయినప్పటికీ సచిన్ తన ఆటను కొనసాగించాడు. భారత్ను గెలిపించడానికి తనవంతు కృషి చేశాడు. అప్పుడు గాయంతో సచిన్ అన్న మాటలు ‘మై ఖేలేగా’ (నేను ఆడతాను) ప్రసిద్ధి చెందాయి. క్రికెట్ చరిత్రలో భాగమయ్యాయి. ఇప్పుడు అవే మాటలు తనయుడు నోటి నుంచి వినడం కాకతాళీయం కావొచ్చు కానీ.. తండ్రి బాటలో తనయుడు సాగుతున్నాడు అని చెప్పకనే చెబుతున్నాయని నెటిజన్లు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్