Gautam Gambhir: ‘నిన్న తప్పించుకున్నావు’.. పాక్ నుంచి గంభీర్కు బెదిరింపులు..!
మాజీ క్రికెటర్, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్పై పాకిస్థాన్ నుంచి బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. గంభీర్కు ప్రాణహాని తలపెడతామంటూ ‘ఐఎస్ఐఎస్, కశ్మీర్’ పేరుతో
వెల్లడించిన దిల్లీ పోలీసు వర్గాలు
దిల్లీ: మాజీ క్రికెటర్, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్కు పాకిస్థాన్ నుంచి బెదిరింపులు వస్తున్నట్లు తెలుస్తోంది. గంభీర్కు ప్రాణహాని తలపెడతామంటూ ‘ఐఎస్ఐఎస్, కశ్మీర్’ పేరుతో వచ్చిన ఈ-మెయిళ్లను పాక్ నుంచే పంపించారని దిల్లీ పోలీసు వర్గాలు గురువారం వెల్లడించాయి. దర్యాప్తులో ఆ ఈ-మెయిళ్ల సోర్స్ పాక్లో ఉన్నట్లు గుర్తించినట్లు భద్రతా వర్గాలు పేర్కొన్నాయి.
గంభీర్ అధికారిక మెయిల్ ఐడీకి 24 గంటల వ్యవధిలో రెండు బెదిరింపు మెయిళ్లు వచ్చాయి. ‘‘గంభీర్కు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రాణహాని తలపెట్టబోతున్నాం’’ అని ఆ ఈ-మెయిల్లో ఉండటంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. గూగుల్ను సంప్రదించారు. ఈ-మెయిళ్లు పంపిన ఖాతాదారు వివరాలు, ఐడీ, ఐపీ అడ్రసు వంటి సమాచారం తెలియజేయాలని కోరారు. గూగుల్ ఇచ్చిన సమాచారం మేరకు ఆ ఈ-మెయిళ్లను పాక్ నుంచి ఓ కాలేజీ విద్యార్థి వీటిని పంపినట్లు తెలిసిందని పోలీసు వర్గాలు తెలిపాయి. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించాయి.
మంగళవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో గంభీర్ మెయిల్ ఐడీకి గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఓ మెయిల్ వచ్చింది. తిరిగి బుధవారం మధ్యాహ్నం అదే ఐడీ నుంచి మరో ఈ-మెయిల్ వచ్చింది. రెండో దానిలో గంభీర్ ఇంటికి సంబంధించిన ఓ వీడియోను పంపించారు. ‘‘నిన్ను చంపాలనుకున్నాం. నిన్న తప్పించుకున్నావు. నువ్వు నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నట్లయితే రాజకీయాలకు, కశ్మీర్ అంశానికి దూరంగా ఉండు’’ అని రెండో మెయిల్లో గంభీర్ను బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. గంభీర్కు వ్యక్తిగతంగాను, దిల్లీలోని ఆయన ఇంటివద్ద భద్రతను పెంచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.