రోహిత్, గిల్ ఏకాగ్రతను దెబ్బతీయాలని..
భారత్×ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ అంటే ఒకప్పుడు యుద్ధ వాతావరణాన్ని తలపించేది. ఆసీస్ కవ్వింపులకు టీమిండియా దీటుగా బదులిస్తుంటే అభిమానులు మ్యాచ్లను ఎంతో ఎంజాయ్ చేశారు. కానీ....
ఇంటర్నెట్డెస్క్: భారత్×ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ అంటే ఒకప్పుడు యుద్ధ వాతావరణాన్ని తలపించేది. ఆసీస్ కవ్వింపులకు టీమిండియా దీటుగా బదులిస్తుంటే అభిమానులు మ్యాచ్లను ఎంతో ఎంజాయ్ చేశారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న సిరీస్లో ప్రశాంత వాతావారణం నెలకొంది. తీవ్ర పోటీ ఉన్నప్పటికీ మాటల యుద్ధం జరగట్లేదు. రెండో టెస్టులో మాథ్యూ వేడ్ మినహా ఎవరూ నోటికి పనిచెప్పలేదు. అయితే తాజాగా స్టార్ బ్యాట్స్మన్ లబుషేన్ భారత ఓపెనర్ల ఏకాగ్రతను దెబ్బతీయాలని వినూత్నంగా ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.
ఆసీస్ 338 పరుగులకు ఆలౌటైన అనంతరం రోహిత్, గిల్ టీమిండియా తొలి ఇన్నింగ్స్ను ఆరంభించారు. ఆసీస్ బౌలర్లను వారిద్దరూ దీటుగా ఎదుర్కొంటూ క్రీజులో కుదురుకుంటున్నారు. అయితే వాళ్ల ఏక్రాగ్రతను దెబ్బతీయాలని భావించిన లబుషేన్ సరదా ప్రశ్నలతో విసిగించాడు. గిల్ను..‘నీకు ఇష్టమైన ఆటగాడు ఎవరు?’ అని ప్రశ్నించాడు. దానికి గిల్ ‘తర్వాత చెప్తా’ అని సమాధానమిచ్చాడు. ‘తర్వాత అంటే? ఈ బాల్ ఆడిన తర్వాతనా?.. సచిన్ ఇష్టమా? లేదా కోహ్లీనా’ అని అడిగాడు. దీనికి గిల్ ఎలాంటి సమాధానమివ్వలేదు.
మరో ఎండ్లో ఉన్న రోహిత్ను కూడా లబుషేన్ మాట్లాడించడానికి ప్రయత్నించాడు. ‘క్వారంటైన్లో ఏం చేశావ్’ అని అడిగాడు. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చిన తర్వాత హిట్మ్యాన్ 14 రోజులు క్వారంటైన్లో ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఓ అభిమాని అత్యుత్సాహం వల్ల నలుగురు భారత ఆటగాళ్లతో సహా అయిదు రోజులు ఐసోలేషన్లో ఉన్నాడు. కాగా, లబుషేన్ ఎంత ప్రయత్నించినా గిల్, రోహిత్ బ్యాటుతో తమ పని చేసుకుపోయారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 70 పరుగులు జోడించారు. గిల్ (50) అర్ధశతకం సాధించగా, రోహిత్ 26 పరుగులు చేశాడు. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ 96/2తో నిలిచింది. ఆసీస్ కంటే ఇంకా 242 పరుగుల వెనుకంజలో ఉంది.
ఇదీ చదవండి
జడ్డూ నాలుగు కాదు.. అయిదు వికెట్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు