చూడ్డానికే గంట సమయం పట్టింది: హార్దిక్‌

భారత్‌×ఇంగ్లాండ్ మధ్య జరగనున్న డే/నైట్ టెస్టుకు ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన మొతెరా వేదిక కానుంది. ఫిబ్రవరి 24 నుంచి ఇరు జట్ల మధ్య ప్రారంభం కానున్న మూడో టెస్టుతోనే..

Published : 21 Feb 2021 01:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌×ఇంగ్లాండ్ మధ్య జరగనున్న డే/నైట్ టెస్టుకు ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన మొతెరా వేదిక కానుంది. ఫిబ్రవరి 24 నుంచి ఇరు జట్ల మధ్య ప్రారంభం కానున్న మూడో టెస్టుతోనే ఆ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్‌కు స్వాగతం పలుకుతోంది. అహ్మదాబాద్‌లో ఉన్న మొతెరా స్టేడియం సామర్థ్యం లక్షా పదివేలు. అయితే ఇప్పటికే మొతెరాకు చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు స్టేడియం అందాలు, సదుపాయాల్ని చూసి ఫిదా అయ్యారు. మొతెరాలో అభిమానుల మధ్య ఆడాలని ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నానని ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య అన్నాడు.

‘‘ఈ వాతావరణంలో అభిమానుల మధ్య ఆడటానికి ఎంతో ఉత్సుకతతో ఉన్నాం. ఆటగాళ్లందరూ మైదానాన్ని ఎంతో ఇష్టపడ్డారు. స్టేడియం, మౌలిక సదుపాయాలను చూడ్డానికే గంట సమయం పట్టింది. అత్యంత సామర్థ్యమున్న స్టేడియం మన దేశంలో ఉన్నందుకు ఎంతో గర్విస్తున్నా. డ్రెస్సింగ్‌రూమ్‌కు జిమ్‌ను అనుసంధించడం ఇక్కడే మొదటిసారి చూశా. ఇది అద్భుతం. గుజరాత్‌ క్రికెట్ అసోషియేషన్‌కు, దీన్ని నిర్మాణంలో భాగస్వాములైనా అందరికీ ధన్యవాదాలు ’’ అని హార్దిక్ పాండ్య పేర్కొన్నాడు. మొతెరా స్టేడియం సదుపాయాల్ని పుజారా, మయాంక్ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్ కూడా కొనియాడారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని