IND vs SA: కొనసాగుతున్న వర్షం... ఆటకు అంతరాయం!

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ నాలుగో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభం కానుంది. జొహనెస్‌బర్గ్‌లో చిరు జల్లులు కురుస్తుండటంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. కాసేపటి క్రితం అంపైర్లు మైదానా

Updated : 06 Jan 2022 15:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ నాలుగో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభం కానుంది. జొహనెస్‌బర్గ్‌లో చిరు జల్లులు కురుస్తుండటంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. కాసేపటి క్రితం అంపైర్లు మైదానాన్ని పరిశీలించారు. వర్షం ఇంకా కొనసాగుతుండటంతో మ్యాచ్‌ను ఆలస్యంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 118/2 స్కోరుతో నిలిచిన విషయం తెలిసిందే. సఫారీల విజయానికి ఇంకా 122 పరుగులు కావాలి. డీన్‌ ఎల్గర్‌ (46), వాండర్‌ డస్సెన్‌ (11) క్రీజులో కొనసాగుతున్నారు. మరో వైపు, భారత్ విజయానికి ఎనిమిది వికెట్ల దూరంలో ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని