T20 League:‘మా జట్టు ఫైనల్ చేరినా నేను సంతోషంగా లేను’
టీ20 లీగ్పై గుజరాత్ ఆటగాడు మాథ్యూ వేడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు ఫైనల్ చేరినా సంతోషంగా లేనని వేడ్ పేర్కొన్నాడు. తనకు వ్యక్తిగతంగా ఈ సీజన్ చాలా చిరాకు కలిగిస్తోందన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్పై గుజరాత్ ఆటగాడు మాథ్యూ వేడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు ఫైనల్ చేరినా సంతోషంగా లేనని వేడ్ పేర్కొన్నాడు. తనకు వ్యక్తిగతంగా ఈ సీజన్ చాలా చిరాకు కలిగిస్తోందన్నాడు. టీ20 లీగ్లో భాగంగా ఆదివారం జరిగే టైటిల్ పోరులో గుజరాత్, రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. అరంగేట్ర సీజన్లోనే మేటి జట్లను మట్టికరిపించి ఏకంగా ఫైనల్కు చేరి అందరిని ఆశ్చర్యపరిచింది గుజరాత్ జట్టు.
‘ఈ సీజన్ వ్యక్తిగతంగా నాకు చికాకు తెప్పిస్తోంది. బ్యాటింగ్ సరిగా చేయకపోవడమే అందుకు ప్రధాన కారణం. మంచి షాట్లతో ఇన్నింగ్స్ను ఆరంభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నా. రాజస్థాన్తో జరిగిన కీలకమైన క్వాలిఫయర్-1 మ్యాచ్లో 35 పరుగులు చేసేంత వరకు నాది చెత్త బ్యాటింగ్ లాగానే కనిపించింది. టీ20 క్రికెట్లో దూకుడుగా ఆడితేనే కలిసొస్తుంది. ఆ ప్లాన్లో నేను విఫలమయ్యా. కీలకమైన ఫైనల్కు ముందు కాస్త మంచి బ్యాటింగ్ చేయడం ఆనందం కలిగించింది. ఒక ఆటగాడిగా విఫలమైనప్పుడు కెప్టెన్ మద్దతు ఉండాలి. ఆ విషయంలో హార్దిక్ నుంచి నాకు మంచి సపోర్ట్ ఉంది. తొలి స్థానం నుంచి ఏడో స్థానం వరకు మా జట్టులో బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. రషీద్ ఖాన్ రూపంలో ఏడో నెంబర్ వరకు విధ్వంసకర బ్యాటింగ్ మాకు ఉండటం అదృష్టం. ఈసారి కప్ గుజరాత్దే’ అని మాథ్యూ వేడ్ అన్నాడు.
ఆస్ట్రేలియా సీనియర్ క్రికెటర్ అయిన మాథ్యూ వేడ్ 11 ఏళ్ల తర్వాత మళ్లీ టీ20 లీగ్లో అడుగుపెట్టాడు. 2011లో దిల్లీకి ప్రాతినిధ్యం వహించిన వేడ్.. ఇప్పటివరకు టీ20 లీగ్లో 12 మ్యాచ్లు ఆడి 171 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్లో రాజస్థాన్తో జరిగిన క్వాలిఫయర్-1లో చేసిన 35 పరుగులే అతడి అత్యధిక స్కోరు కావడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ