Mayank Agarwal: ఇది చాలా కష్టమైన మ్యాచ్.. అయినా పోరాడాం: మయాంక్
గుజరాత్తో తలపడిన పోరులో విజయం సాధించడానికి చాలా కష్టపడ్డా ఫలితం లేకపోయిందని పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అన్నాడు. గతరాత్రి బ్రబౌర్న్ మైదానంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ నిర్దేశించిన 190...
(Photos: Mayank Agarwal, Hardik Pandya Instagram)
ముంబయి: గుజరాత్తో తలపడిన పోరులో విజయం సాధించడానికి చాలా కష్టపడ్డా ఫలితం లేకపోయిందని పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అన్నాడు. గతరాత్రి బ్రబౌర్న్ మైదానంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ నిర్దేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ ఆఖరి బంతికి ఛేదించిన సంగతి తెలిసిందే. రాహుల్ తెవాతియా (13 నాటౌట్; 3 బంతుల్లో 2x6) ఆఖరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి గుజరాత్కు మర్చిపోలేని విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం మాట్లాడిన మయాంక్ ఇలా స్పందించాడు.
‘ఇది చాలా కష్టమైన మ్యాచ్. మేం విజయం సాధించడానికి ఎంతో కష్టపడ్డాం. ఇంకో 5-7 పరుగులు చేయాల్సింది. అయినా, గుజరాత్ ఆరంభంలో ధాటిగా ఆడినా.. తర్వాత మేం పుంజుకున్నాం. బ్యాటింగ్లో తొమ్మిది వికెట్లు కోల్పోయినా 189 పరుగులు సాధించామంటే గొప్పగా ఆడాం. ఈ విషయంలో సంతోషంగా ఉన్నాం. మా బౌలర్లు అర్ష్దీప్, రబాడా అత్యుత్తమ బౌలింగ్ చేశారు. మ్యాచ్ను చేజిక్కించుకునేందుకు విజయపుటంచుల దాకా తీసుకెళ్లారు. అయితే, చివరి ఓవర్లో ఫలితం ఇరు జట్లకూ సమానంగా మారింది. గుజరాత్ గెలుపొందినా చివరి ఓవర్ వేసిన ఒడియన్కు మేం అండగా ఉంటాం. అతడికి వందశాతం మద్దతిస్తాం. ఈ ఓటమి జీర్ణించుకోవడం కష్టమే అయినా.. మేం తిరిగి పుంజుకుంటాం’ అని అగర్వాల్ చెప్పుకొచ్చాడు.
నేను న్యూట్రల్గా మారా: హార్దిక్
ఇక గుజరాత్ సారథి హార్దిక్ పాండ్య మాట్లాడుతూ.. ఆటలో గెలుపోటములు సహజమేనని చెప్పాడు. తాను ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నానని, గెలుపోటములతో సంబంధం లేదని చెప్పాడు. ఇక తమ జట్టు బ్యాటింగ్పై స్పందిస్తూ.. ‘చివర్లో రాహుల్ తెవాతియా చాలా గొప్పగా ఆడాడు. అతడికి హ్యాట్సాఫ్. ఉత్కంఠభరితమైన పరిస్థితుల్లో అలా వెళ్లి ఒత్తిడిని జయించి బ్యాటింగ్ చేయడం గొప్ప విశేషం. నిజం చెప్పాలంటే ఇది పంజాబ్ మ్యాచ్. వాళ్లు ఓటమిపాలవ్వడం నాకు బాధగా ఉంది. మా బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ చాలా మంచి ప్రదర్శన చేశారు. ముఖ్యంగా సాయికి క్రెడిట్ ఇవ్వాలి. అతడు గిల్తో నెలకొల్పిన భాగస్వామ్యం అమూల్యమైనది. ఆ భాగస్వామ్యమే మమ్మల్ని చివరివరకూ మ్యాచ్లో నిలబెట్టింది. నా విషయానికి వస్తే.. ప్రతి మ్యాచ్కూ మెరుగవుతున్నా. అయితే, పూర్తిగా నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేయలేక అలసిపోతున్నా’ అని పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత