Bhavani Devi: నా ఫెన్సింగ్ కిట్ కోసం.. అమ్మ నగలమ్మింది
ఫెన్సింగ్.. ఇలాంటి ఓ క్రీడ ఉందని చాలా మంది భారతీయులకు తెలియదు. కానీ ఆ క్రీడను ఎంచుకొని ముందుకు సాగింది తమిళనాడుకు చెందిన చందలవాడ ఆనంద సుందరామన్ భవానీ దేవి....
కష్టాల కడలిని ఈది ఒలింపిక్స్ వేదికపైకి..
ఇంటర్నెట్ డెస్క్: ఫెన్సింగ్.. ఇలాంటి ఓ క్రీడ ఉందని చాలా మంది భారతీయులకు తెలియదు. కానీ ఆ క్రీడను ఎంచుకొని ముందుకు సాగింది తమిళనాడుకు చెందిన చందలవాడ ఆనంద సుందరామన్ భవానీ దేవి. ఒలింపిక్స్లో భారత్ తరఫున ఫెన్సింగ్లో పోటీ పడ్డ మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. దేశం ఇప్పుడు ఆమె వైపు చూస్తోంది. రెండో రౌండ్లో ఓటమిపాలైనా భవానీ ఇప్పుడు ఎంతోమంది యువతకు ఆదర్శప్రాయం.
యాదృచ్ఛికంగానే ఈ ఆటను ఎంచుకున్నా.. అందులో రాణించేందుకు ప్రాణం పెట్టినట్లు తెలిపింది భవానీ. ఏషియన్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించినా తనను ఎవరూ గుర్తించలేదని.. తాను పడ్డ కష్టాలకు ఇప్పుడు గుర్తింపు లభిస్తోందని పేర్కొంది. ‘నా 11వ ఏట.. పాఠశాలలో జరగబోతున్న క్రీడా పోటీల్లో భాగంగా ఏదైనా ఓ క్రీడను ఎన్నుకోవాలని చెప్పారు. అయితే ఫెన్సింగ్ను కేవలం ఒకే ఒక్కరు ఎంచుకొన్నారు. ఇదేదో ప్రత్యేకంగా ఉంది కదా అని నేను దాన్నే ఎంచుకొన్నా’ అని ఈ క్రీడలో తన ప్రస్థానాన్ని చెప్పుకొచ్చింది.తన తల్లిదండ్రులు వెన్నంటే నిలిచారని పేర్కొంది. ‘మా అమ్మ తన నగలమ్మి రూ.6 వేలతో నాకు మొట్టమొదటి ఫెన్సింగ్ కిట్ను కొనిచ్చింది. విదేశాల్లో పోటీ పడేందుకు నాకు స్పాన్సర్షిప్ ఇప్పించేందుకు నా తల్లిదండ్రులు పలువురు అధికారుల ఇళ్లముందు గంటల కొద్దీ నిరీక్షించేవారు. ఫెన్సింగ్లో సరైన గురువు లేక, కుటుంబం ఆర్థికంగా చితికిపోవడాన్ని చూసి కుంగిపోయా. ఆటలో వెనకబడ్డా. కానీ ఓ టోర్నీ వేదికగా నాకు గురువు లభించారు. శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించారు’ అని తెలిపింది. ఆ గురువు సాయంతోనే అండర్-17 నేషనల్ ఛాంపియన్షిప్లో పసిడి పతకం సాధించినట్లు పేర్కొంది.
అయినప్పటికీ భవానీని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతూనే వచ్చాయి. తీసుకున్న రూ. 10 లక్షల లోన్ డబ్బులు శిక్షణలో ఖర్చయిపోయాయి. దీంతో కొద్ది రోజులపాటు ఆమె ఆటకు దూరంగా ఉంది. కానీ భవానీపై వాళ్ల అమ్మ నమ్మకం కోల్పోలేదు. తెలిసిన వారి వద్ద అప్పు చేస్తూ కుమార్తె శిక్షణ కోసం ఖర్చు చేసింది. దీంతో మళ్లీ శిక్షణ ప్రారంభించిన దేవి ఏషియన్ ఛాంపియన్షిప్లో రజతం సాధించింది. ఈ క్రీడల్లో మొట్టమొదటి పతకం సాధించిన భారతీయురాలు భవానీనే. అయినప్పటికీ తనకు తగినంత గుర్తింపు రాలేదని.. ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయని ఈ ఫెన్సర్ చెప్పుకొచ్చింది.
‘విదేశాల్లో జరుగుతున్న ఓ టోర్నీలో పాలుపంచుకునేందుకు నా తల్లిదండ్రులు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉండగా.. సాయమందించాలని అప్పటి ముఖ్యమంత్రి జయలలితకు ఓ లేఖ రాశాను. దానికి స్పందించిన ఆమె.. ఇంటికొచ్చి తనను కలవాలని, నాకు అయ్యే ఖర్చులన్నీ భరిస్తామని చెప్పారు. దీంతో ఎట్టకేలకు నాకు అదృష్టం కలిసొచ్చిందని సంతోషించా. ఎన్నో పరీక్షలు, ట్రయల్స్ అనంతరం.. ఈ ఏడాది నాకు ఓ శుభవార్త అందింది. అదే టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించడం’ అని భవానీ సంతోషం వ్యక్తం చేసింది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ ఛాంపియన్షిప్లో గెలుపొందడంతో.. రూ.10 లక్షల లోన్ను తిరిగి చెల్లించానని, దీంతో తన తల్లిదండ్రుల మీద భారం తగ్గించానని వెల్లడించింది. ప్రస్తుతం ఓ ఇంటిని కొనేందుకు సన్నాహాలు చేస్తున్నానని, ఇల్లు కొని తన తల్లిదండ్రులను సర్ప్రైజ్ చేస్తానని చెప్పింది.
టోక్యో ఒలింపిక్స్ తొలి రౌండ్లో ఘన విజయం సాధించిన భవానీ దేవీ రెండో రౌండ్లో ఓటమి పాలైంది. ప్రపంచ మూడో ర్యాంకర్తో పోరాడి వెనుదిరిగింది. ఆ ఓటమి అనంతరం ఆమె ఓ ట్వీట్ చేసింది. తొలి రౌండ్లో 15/3 తేడాతో అద్భుత విజయం సాధించానని, రెండో రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ చేతిలో 7/15తో ఓటమి పాలైనట్లు తెలిపింది. ‘నా శక్తిసామర్థ్యాలమేరకు ప్రయత్నించినా విజయం సాధించలేకపోయా. నన్ను క్షమించండి.. ప్రతి ముగింపు ఓ ప్రారంభానికి నాంది. శిక్షణను కొనసాగిస్తా. 2024 ఒలింపిక్స్ లక్ష్యంగా ముందుకు సాగుతా’ అని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?