Rebecca Downie: 12ఏళ్ల బాలిక.. క్రికెట్ జట్టు జెర్సీని డిజైన్ చేసింది
ఐసీసీ టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపర్చింది స్కాట్లాండ్ జట్టు. అయితే అంతకంటే ప్రత్యేకమైన మరో విషయం
Photo: Cricket Scotland Twitter
ఇంటర్నెట్డెస్క్: ఐసీసీ టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపర్చింది స్కాట్లాండ్ జట్టు. అయితే అంతకంటే ప్రత్యేకమైన మరో విషయం ఆ జట్టు ధరించిన జెర్సీ. అందులో అంత విశేషం ఏముంది అంటారా..? అది నిజంగా స్పెషలే. ఎందుకంటే ఆ జెర్సీని డిజైన్ చేసింది మల్టీమిలియన్ బ్రాండెడ్ సంస్థలేవీ కాదు. 12 ఏళ్ల బాలిక. ప్రపంచకప్ కోసం స్కాట్లాండ్ ఆటగాళ్లు ధరించిన కొత్త జెర్సీని రూపొందించింది పన్నెండేళ్ల రెబెకా డౌమీ.
ప్రపంచ కప్లో కొత్త జెర్సీతో పాల్గొనాలని స్కాట్లాండ్ జట్టు భావించింది. అయితే దీన్ని మరింత ప్రత్యేకంగా మార్చాలన్న ఆలోచనతో ఈసారి విద్యార్థులకు అవకాశం కల్పించింది. జెర్సీ డిజైన్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న స్కూల్ విద్యార్థులను ఆహ్వానించింది. దీనికి మంచి స్పందన లభించింది. మొత్తం 200 మంది విద్యార్థులు తమ డిజైన్లను పంపించారు. వీటిలో హాడింగ్టన్ ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల రెబెకా డౌనీ పంపించిన డిజైన్ విజేతగా నిలిచింది. ఆమె డిజైన్ చేసిన ఊదా రంగు జెర్సీ స్కాట్లాండ్ జట్టు యాజమాన్యానికి ఎంతగానో నచ్చింది. ఆ దేశ జాతీయ చిహ్నం ‘ది థిస్టిల్’ రంగులైన ముదురు నీలం, పర్పుల్ రంగులతో రెబెకా ఈ జెర్సీని రూపొందించింది. స్కాట్లాండ్ జట్టు ప్రపంచకప్ పర్యటనకు వెళ్లే కొద్ది రోజుల ముందు రెబెకా చేతుల మీదుగానే ఈ జెర్సీలను జట్టు ఆటగాళ్లకు అందజేశారు.
అంతేనా.. రెబెకా డిజైన్ చేసిన జెర్సీ ఇప్పుడా జట్టుకు లక్కీ ఛార్మ్గా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ జెర్సీ ధరించి తొలి మ్యాచ్లోనే బంగ్లాదేశ్కు షాకిచ్చిన స్కాట్లాండ్ టీం.. రెండో మ్యాచ్లో పపువా న్యూ గినియాపైనా విజయం సాధించింది. దీంతో సూపర్ 12 అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. గ్రూప్లో చివరి మ్యాచ్లో ఒమన్ను ఓడిస్తే.. స్కాట్లాండ్ సూపర్ 12కు చేరుకుంటుంది.
ఈ సందర్భంగా స్కాట్లాండ్ జట్టు ట్విటర్ వేదికగా రెబెకాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె ఫొటోను పంచుకుంది. ‘‘స్కాట్లాండ్ కిట్ డిజైనర్. 12ఏళ్ల రెబెకా డౌనీ. ఆమె తాను డిజైన్ చేసిన డ్రెస్ ధరించి మా తొలి మ్యాచ్ను వీక్షించింది. థాంక్యూ రెబెకా’’ అని రాసుకొచ్చింది. జెర్సీ కాంపిటీషన్లో విజయం సాధించడంపై రెబెకా ఆనందం వ్యక్తం చేసింది. ‘‘నేను గెలిచానంటే నమ్మలేకపోయా. రియల్ లైఫ్లో నా జెర్సీ చూసినందుకు ఆనందంగా ఉంది. జట్టును కలవడం చాలా సంతోషంగా ఉంది. వరల్డ్కప్లో మా టీం ఆడే ప్రతి మ్యాచ్ సమయంలోనూ ఈ జెర్సీ ధరించి వాళ్లను ఉత్సాహపరుస్తాను’’ అని చెప్పుకొచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు