T20 League : మెగా వేలం.. అమాంతం రేట్లు పెరిగిపోయాయ్!
మెగా వేలం కొందరిపై కాసుల వర్షం కురిపించింది. గత వేలం కంటే ఈ సారి భారీ..
ఇంటర్నెట్ డెస్క్: టీ20 టోర్నీ మెగా వేలం కొందరిపై కాసుల వర్షం కురిపించింది. గత వేలం కంటే ఈ సారి భారీ మొత్తం సొంతం చేసుకుని జాక్పాట్ కొట్టినవారూ ఉన్నారు. ఇందులో ఎక్కువగా యువ క్రికెటర్లే ఉండటం విశేషం. అందులోనూ వేలంలో భారీ ధరను దక్కించుకున్న క్యాప్డ్, అన్క్యాప్డ్ ఆటగాళ్లు ఇద్దరూ టీమ్ఇండియాకే చెందినవారు కావడం అభిమానులకు కిక్ ఇచ్చేదే. పది ఫ్రాంచైజీలు 204 మంది ఆటగాళ్లను దాదాపు రూ.550 కోట్లకుపైగా వెచ్చించి సొంతం చేసుకున్నాయి. గతం కంటే ఈసారి భారీ ధరను దక్కించుకున్న ఆటగాళ్ల ఎవరు.. ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసిందనే విషయాలను ఓసారి తెలుసుకుందాం..
దీపక్ చాహర్ : చెన్నై జట్టులో రవీంద్ర జడేజా తర్వాత అత్యంత విలువైన ఆటగాడు దీపక్ చాహరే. అవునండీ ధోనీ (రూ.12 కోట్లు)ని వెనక్కి నెట్టేసి మరీ వేలంలో రూ. 14 కోట్లను దక్కించుకున్నాడు. ధోనీ, జడేజా, మొయిన్ అలీ, రుతురాజ్లను చెన్నై రిటెయిన్ చేసుకున్న సంగతి తెలిసిందే. గత వేలంలో రూ. 80 లక్షలకే సొంతం చేసుకున్న చెన్నై.. ఈసారి మాత్రం భారీ ధరను చెల్లించాల్సి వచ్చింది. ఆల్రౌండర్గా ఎదుగుతున్న దీపక్ చాహర్కు ఆ మాత్రం రేటు ఇవ్వక తప్పలేదు.
పరిమితమయ్యాడు.
అవేశ్, దీపక్ హుడా, డికాక్, హోల్డర్ : ఆల్రౌండర్లతోపాటు బ్యాటర్, బౌలర్ల మీద లఖ్నవూ ఇన్వెస్ట్ చేసింది. డికాక్ను రూ. 6.75 కోట్లు, జాసన్ హోల్డర్ను రూ. 8.75 కోట్లు, దీపక్ హుడా రూ. 5.75 కోట్లు, మార్క్ వుడ్ రూ. 7.50 కోట్లతో సొంతం చేసుకుంది. అన్క్యాప్డ్ ప్లేయర్ అవేశ్ ఖాన్కు రూ. 10 కోట్ల భారీ మొత్తాన్ని దక్కించుకోవడం విశేషం. గతేడాది అవేశ్కు దిల్లీ రూ. 70 లక్షలనే చెల్లించింది. దాదాపు 14 రెట్లు అధికంగా వేలంలో సొంతం చేసుకున్నాడు. జాసన్ హోల్డర్కు కూడా హైదరాబాద్ రూ. 75 లక్షలే ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా 12 రెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్, చేతన్ : గత సీజన్ వరకు చెన్నైకి ఆడిన శార్దూల్ ఠాకూర్ను ఈసారి దిల్లీ తీసుకుంది. మొన్నటి దాకా రూ. 2.60 కోట్లను మాత్రమే అందుకున్న శార్దూల్ ఈసారి మెగా వేలంలో రూ. 10.75 కోట్లకు దూసుకెళ్లాడు. అదే విధంగా ఫాస్ట్బౌలర్ ఖలీల్ అహ్మద్ కూడా రూ 5.25 కోట్లను అందుకోనున్నాడు. చేతన్ సకారియా కూడా రూ. 4.20 కోట్లను దక్కించుకున్నాడు. వీరందరినీ దిల్లీనే సొంతం చేసుకుంది.
పడిక్కల్, షిమ్రోన్ హెట్మయర్, బౌల్ట్, చాహల్ : బెంగళూరు ఓపెనర్గా రాణించిన దేవదుత్ పడిక్కల్కు గత సీజన్ వరకు దక్కింది కేవలం రూ. 20 లక్షలే. అయితే ఈ సారి మెగా వేలంలో కనీస ధర రూ. 2 కోట్లుగా నమోదు చేసుకున్న దేవదుత్కు భారీ డిమాండ్ వచ్చింది. రాజస్థాన్ రూ. 7.75 కోట్లకు సొంతం చేసుకుంది. అదే విధంగా టీమ్ఇండియా యువ బౌలర్ ప్రసిధ్ కృష్ణకు కాసుల వర్షం కురిసింది. రూ. 10 కోట్లను వెచ్చించి మరీ దక్కించుకోవడం విశేషం. గత సీజన్ వరకు రూ. 20 లక్షలను అందుకున్న ప్రసిధ్ జాక్పాట్ కొట్టేశాడు. గత సీజన్ వరకు రూ. 3.20 కోట్లను తీసుకున్న బౌల్ట్ ఈసారి మాత్రం వేలంలో రూ. 8 కోట్లను దక్కించుకున్నాడు. బెంగళూరు బౌలింగ్ తురుపుముక్కగా మారిన చాహల్ను రూ. 6.50 కోట్లకు రాజస్థాన్ సొంతం చేసుకుంది.
ఐదుగురికీ అదృష్టం: హైదరాబాద్ కొనుగోలు చేసిన ఐదుగురికి అదృష్టం కలిసొచ్చింది. ఇందులో ఇద్దరు ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్ (రూ. 8.75 కోట్లు), రోమారియో షెఫెర్డ్ (రూ.7.75 కోట్లు) అభిషేక్ శర్మ (రూ.6.50 కోట్లు) కాగా.. బ్యాటర్లు నికోలస్ పూరన్ (రూ.10.75 కోట్లు), రాహుల్ త్రిపాఠి (రూ. 8.50 కోట్లు) భారీ మొత్తం దక్కించుకున్నారు. ఇక యువ బౌలర్లు కార్తిక్ త్యాగి, టి. నటరాజన్ కూడా నాలుగేసి కొట్లను సొంతం చేసుకున్నారు. దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ మార్కో జాన్సెన్ను హైదరాబాద్ రూ. 4.20 కోట్లు వెచ్చించి మరీ దక్కించుకుంది. సీన్ అబాట్ కోసం రూ.2.40 కోట్లను వెచ్చించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
ముంబయి ఆటగాడు, కోచ్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ కొరడా ఝళిపించింది. వారు చేసిన చర్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. -
Ravindra Jadeja: గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో జడేజా క్యాచ్!
లఖ్నవూతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా.. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ ఒడిసిపట్టాడు.
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
అభిమానుల ఊహకు అందనిరీతిలో.. సంచలన ఆటతో ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టేస్తోంది. ఇవాళ మరో మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమవుతోంది. -
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?