LSG vs MI: అవకాశం కోసం అప్పటి నుంచి ఎదురుచూస్తూనే ఉన్నా: ఆకాశ్ మధ్వాల్
ఎలిమినేటర్ మ్యాచ్లో లఖ్నవూను ఓడించడంలో ముంబయి యువ బౌలర్ ఆకాశ్ మధ్వాల్ (Akash Madhwal) కీలక పాత్ర పోషించాడు. దీంతో పలు రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్ (IPL 2023) టైటిల్ పోరులో ముంబయి ఇండియన్స్ మరొక ముందడుగు వేసింది. ఎలిమినేటర్ మ్యాచ్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ను చిత్తు చేసి రెండో క్వాలిఫయర్లోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 182/8 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో లఖ్నవూ 101 పరుగులకే ఆలౌట్ చేసింది. ముంబయి బౌలర్ ఆకాశ్ మధ్వాల్ 3.3 ఓవర్లలో కేవలం ఐదు పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీసి లఖ్నవూ పతనంలో కీలకపాత్ర పోషించాడు. ముంబయి చరిత్రలో రెండో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన బౌలర్గా అవతరించాడు. గతంలో అల్జారీ జోసెఫ్ (6/12) సన్రైజర్స్పై ఇలాగే చెలరేగాడు. ఇప్పుడు మధ్వాల్ ఐదు వికెట్ల ప్రదర్శనతో బుమ్రా (5/10), మలింగ (5/13)ను దాటేశాడు.
ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించిన మధ్వాల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం మధ్వాల్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి అవకాశం కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నా. అందుకోసం చాలా శ్రమించా. ఇంజినీరింగ్ చదివిన నాకు క్రికెట్ అంటే పిచ్చి. 2018 నుంచి నా సత్తాను చాటేందుకు నిరీక్షించా. ప్రాక్టీస్ సెషన్స్ సందర్భంగా నెట్స్లో మాకంటూ కొన్ని లక్ష్యాలను మేనేజ్మెంట్ నిర్దేశించేది. దీంతో మా అత్యుత్తమ ప్రతిభను వెలికి తీసేవారు. రాబోయే మ్యాచుల్లోనూ ఇదే ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తా. నికోలస్ పూరన్ను తొలి బంతికే ఔట్ చేయడం ఎంతో ఆనందం కలిగించింది’’ అని చెప్పాడు.
అభిమానులు కూడా ఊహించి ఉండరు: రోహిత్
‘‘గతేడాది సపోర్ట్ బౌలర్గా ఉన్న ఆకాశ్ మధ్వాల్.. ఈసారి తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం అద్భుతం. మేం ఆడిన విధానం చూసి ఇక్కడి వరకు చేరుతామని అభిమానులు కూడా ఊహించి ఉండరు. గత కొన్నేళ్లుగా యువ క్రికెటర్లకు ఎన్నో అవకాశాలు కల్పిస్తూ వచ్చాం. జట్టులో వారు కీలకమనే భావన కల్పించడం చాలా ముఖ్యం. నా బాధ్యత కూడా అదే. జట్టులో వారికి సౌకర్యంగా ఉండేలా చూస్తా. జట్టు కోసం ఏం చేయాలనేదానిపై వారికి పూర్తి అవగాహన ఉంది. వాంఖడే స్టేడియంలో ఒకటీ రెండు మంచి ప్రదర్శనలు ఉంటే సరిపోతుంది. కానీ, చెన్నై పిచ్పై జట్టు మొత్తం కలిసి ఆడాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ జట్టు విజయంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది’’ అని ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.
అతడి వల్లే ఇదంతా: కామెరూన్ గ్రీన్
ముంబయి ఇన్నింగ్స్లో కామెరూన్ గ్రీన్ (41) టాప్ స్కోరర్. బౌలింగ్లోనూ మూడు ఓవర్లు వేసిన గ్రీన్ వికెట్ తీయకపోయినా కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి గేమ్ మాకు చాలా కీలకం. సరైన సమయంలో విజయం సాధించాం. మధ్వాల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. గత మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసిన అతడు.. ఇంకా అద్భుతంగా ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఫీల్డింగ్లోనూ చాలా మెరుగయ్యాం. ఇక గుజరాత్ టైటాన్స్ పటిష్ఠమైన జట్టు. చెన్నై చేతిలో ఓటమిపాలైనప్పటికీ.. తక్కువగా అంచనా వేయలేం. తప్పకుండా మంచి మ్యాచ్ అవుతుందని భావిస్తున్నా’’ అని చెప్పాడు.
మ్యాచ్కు సంబంధించి మరికొన్ని విశేషాలు
- ఐపీఎల్ ప్లేఆఫ్స్లో లఖ్నవూ సాధించిన 101 పరుగులు మూడో అత్యల్ప స్కోరు. గతంలో ఆర్సీబీపై (2010 సీజన్లో) 82 పరుగులు, రాజస్థాన్పై (2008 సీజన్లో) 87 పరుగులను డెక్కన్ ఛార్జర్స్ చేసింది.
- అన్క్యాప్డ్ ప్లేయర్లలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన ప్లేయర్గా ఆకాశ్ మధ్వాల్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో 5/5 ప్రదర్శన చేయగా.. గతంలో కింగ్స్ పంజాబ్ ఆటగాడు అంకిత్ రాజ్పుత్ సన్రైజర్స్పై (2018 సీజన్లో) 5/14 ప్రదర్శన చేశాడు.
- ఐపీఎల్లోనే అత్యుత్తమ బౌలింగ్ చేసిన బౌలర్ల జాబితాలో ఆకాశ్ మధ్వాల్ ఐదో స్థానంలో నిలిచాడు. అల్జారీ జోసెఫ్ (6/12), సోహైల్ తన్వీర్ (6/14), ఆడమ్ జంపా (6/19), అనిల్ కుంబ్లే (5/5) ముందున్నారు. ఐపీఎల్ ప్లేఆఫ్స్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కూడా ఆకాశ్ మధ్వాల్ పేరునే ఉండటం విశేషం.
- ఐపీఎల్ ప్లేఆఫ్స్లో భారీ తేడాతో గెలిచిన మూడో జట్టుగా ముంబయి రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్లో లఖ్నవూపై ముంబయి 81 పరుగుల తేడాతో గెలిచింది. గతంలో డెక్కన్ ఛార్జర్స్పై రాజస్థాన్ 105 పరుగులు, డెక్కన్ ఛార్జర్స్పై సీఎస్కే 86 పరుగుల తేడాతో విజయం సాధించాయి.
- ప్లేఆఫ్స్లోని ఒకే మ్యాచ్లో అత్యధిక రనౌట్లు అయిన రెండో మ్యాచ్ ఇదే. గతంలో ముంబయి-సీఎస్కే మధ్య జరిగిన మ్యాచ్లోనూ మూడు రనౌట్లు నమోదు కాగా.. నిన్నటి మ్యాచ్లోనూ ముగ్గురు ఇలా పెవిలియన్కు చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీపై విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్