MIvsCSK:10 ఓవర్లు..30 సిక్సర్లు..30 బౌండరీలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఇప్పటి వరకు ఎన్నో అత్యుత్తమ మ్యాచులు జరిగాయి. హోరాహోరీగా సాగిన పోరాటాలెన్నో చూశాం. ఆఖరి బంతికి తేలిన ఫలితాలు, సూపర్ ఓవర్లో గెలిచిన మ్యాచులను వీక్షించాం. దిల్లీ వేదికగా చెన్నై సూపర్కింగ్స్,....
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఇప్పటి వరకు ఎన్నో అత్యుత్తమ మ్యాచులు జరిగాయి. హోరాహోరీగా సాగిన పోరాటాలెన్నో చూశాం. ఆఖరి బంతికి తేలిన ఫలితాలు, సూపర్ ఓవర్లో గెలిచిన మ్యాచులను వీక్షించాం. దిల్లీ వేదికగా చెన్నై సూపర్కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచు సైతం ఇదే కోవలోకి వస్తుంది. చరిత్రలో అత్యంత గొప్ప మ్యాచుల్లో ఒకటిగా నిలిచిపోనుంది. బౌండరీలు, సిక్సర్ల వరద పారిన ఈ పోరులో రికార్డులెన్నో బద్దలయ్యాయి.
* మొదట సీఎస్కే 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ముంబయిపై చెన్నైకి ఇదే అత్యధిక స్కోరు.
* భారీ లక్ష్యాన్ని ముంబయి ఆఖరి బంతికి ఛేదించింది. 6 వికెట్లు నష్టపోయి 219 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక విజయవంతమైన ఛేదన. ముంబయి చేసిన అత్యధిక ఛేదనా ఇదే కావడం గమనార్హం.
* అంబటి రాయుడు (72*; 27 బంతుల్లో ) మొదట అజేయంగా నిలిచాడు. అతడు కేవలం 20 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. చెన్నై తరఫున ఇది మూడో అత్యధిక వేగవంతమైన అర్ధశతకం. అంతకు ముందు 2014లో పంజాబ్పై రైనా 16 బంతుల్లో, 2012లో బెంగళూరుపై ఎంఎస్ ధోనీ 20 బంతుల్లో నమోదు చేశారు.
* ఐపీఎల్ మ్యాచుల్లో బుమ్రా ఎక్కువ పరుగులు ఇవ్వడం ఇదే తొలిసారి. నాలుగు ఓవర్ల కోటా వేసి 56 పరుగులు ఇచ్చాడు. 2015లో దిల్లీపై 55, అదే ఏడాది బెంగళూరుపై 52, 2017లో గుజరాత్పై 45 పరుగులు ఇవ్వడం గమనార్హం.
* విజయవంతమైన ఛేదనల్లో ఆఖరి 10 ఓవర్లలో చేసిన అత్యధిక పరుగులు 138. సీఎస్కేపై ముంబయి చేసింది. పొలార్డ్ (87*; 34 బంతుల్లో) ఊచకోతే ఇందుకు కారణం. 2019లో పంజాబ్పైనా ముంబయి 133 పరుగులు చేసింది. అప్పుడూ పొలార్డే 31 బంతుల్లో 83 బాదేశాడు. 2013లో బెెంగళూరుపై పంజాబ్ 126 పరుగులు చేయడం గమనార్హం.
* ఈ మ్యాచులో మొత్తం 30 సిక్సర్లు, 30 బౌండరీలు నమోదయ్యాయి. అంటే మొత్తం 40 ఓవర్లు ఆట సాగితే 10 ఓవర్లు బౌండరీలే బాదడం ప్రత్యేకం.
* చెన్నై 16 సిక్సర్లు, 14 బౌండరీలు బాదగా ముంబయి 14 సిక్సర్లు, 16 బౌండరీలు కొట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?