Virat Kohli: అందరిలాగే కోహ్లీ కూడా విసుగు చెందాడు: మైక్ హెసన్
అందరిలాగే విరాట్ కోహ్లీ కూడా తన ఆట పట్ల విసుగుచెందాడని బెంగళూరు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెసన్ అన్నాడు...
ముంబయి: అందరిలాగే విరాట్ కోహ్లీ కూడా తన ఆట పట్ల విసుగుచెందాడని బెంగళూరు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెసన్ అన్నాడు. గతరాత్రి పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 20 పరుగులే చేసి మరోసారి నిరాశపర్చిన కోహ్లీ.. పెవిలియన్కు చేరేటప్పుడు తీవ్ర అసహనంతో కనిపించాడు. 210 పరుగుల భారీ ఛేదనలో కెప్టెన్ డుప్లెసిస్తో కలిసి ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించిన అతడు 3.2 ఓవర్కు రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు. అయితే, అంతలోపే 14 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ సాధించి మంచి టచ్లో ఉన్నట్లు కనిపించాడు. దీంతో ఈ మ్యాచ్లో అతడు చెలరేగిపోతాడని అంతా భావించారు. కానీ, తక్కువ స్కోరుకే ఔటై తీవ్రంగా నిరాశ చెందాడు. అతడు పెవిలియన్ బాటపట్టినప్పుడు అసహనంతో ఏదో అరుస్తూ కనిపించాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం కోహ్లీ గురించి హెసన్ మాట్లాడాడు.
‘ఈ మ్యాచ్లో విరాట్ బాగా ఆడేలా కనిపించాడు. ఇన్నింగ్స్ను కూడా ధాటిగా ఆరంభించాడు. అందుకోసం నెట్స్లో తీవ్రంగా శ్రమించాడు. దీంతో ఈ మ్యాచ్లో అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ వస్తుందని ఆశించాను. కానీ, మరోసారి నిరాశే మిగిలింది. అతడు ఔటైన బంతి గ్లౌజ్ అంచులకు తాకుతూ గాల్లోకి వెళ్లింది. అది దురదృష్టకరం. పలు బౌండరీలు సాధించి.. బాగా ఆడుతున్నట్లు.. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించినా.. వెంటనే ఔటవ్వడం ఊహించలేనిది. కోహ్లీకి కూడా ఇది బాధగానే అనిపించింది. ఈరోజు ఆటలో టెక్నికల్గానూ ఎలాంటి సమస్య కనిపించలేదు. అయినా విఫలమవుతున్నాడు. దాంతో కోహ్లీ కూడా అందరిలాగే విసుగుచెందాడు. ఇక మాకు మిగిలింది ఒక్క మ్యాచే. అందులో చేయాల్సిన పని చాలా ఉంది’ అని బెంగళూరు డైరెక్టర్ వివరించాడు. కాగా, ఈ మ్యాచ్లో బెయిర్స్టో (66), లివింగ్స్టోన్ (70) దంచికొట్టడంతో పంజాబ్ 209/9 స్కోర్ సాధించింది. అనంతరం బెంగళూరు 155/9 పరుగులే చేసి ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ ఆరో స్థానానికి చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి