CWG 2022 : బంగారు పతకాల ‘లిఫ్టర్లు’.. వైరల్‌గా మారిన పిక్‌

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత అథ్లెట్లు, క్రీడాకారులు పతకాల కోసం పోరాడుతున్నారు. ఇప్పటి వరకు 18 పతకాలను...

Published : 04 Aug 2022 13:22 IST

(ఫొటో సోర్స్‌: మీరాబాయి చాను ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల కోసం పోరాడుతున్నారు. ఇప్పటి వరకు 18 పతకాలను సాధించారు. వీటిల్లో ఐదు స్వర్ణ, ఆరు రజత, ఏడు కాంస్య పతకాలున్నాయి. దీంతో పతకాల పట్టికలో భారత్‌ ఏడో స్థానంలో నిలిచింది. నేడు పురుషుల లాంగ్‌జంప్‌ ఫైనల్‌లో మహమ్మద్ అనీస్, శ్రీశంకర్‌ పతకం కోసం బరిలోకి దిగుతున్నారు. బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్ విభాగాల్లో పతకాల పంట పండుతోంది. ఈ క్రమంలో వెయిట్‌లిఫ్టింగ్‌లో బంగారు పతకాలు సాధించిన లిఫ్టర్లు తమ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. 

మీరాబాయి చాను, జెరెమీ లాల్రినుంగా, ఆచింత సూయిలీ వెయిట్‌లిఫ్టింగ్‌లో బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో మీరాబాయి చాను తన సోషల్‌ మీడియా ట్విటర్‌లో ముగ్గురు కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసింది. ‘ది గోల్డెన్‌ ట్రయో’’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతూ పెద్ద ఎత్తున స్పందించారు. 41 వేలకుపైగా లైకులు, రెండువేల వరకు రిట్వీట్‌లు వచ్చాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని