PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
మికీ ఆర్థర్ను పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మరోసారి కోచ్గా నియమించాలని పీసీబీ (PCB) నిర్ణయం తీసుకొంది. దీనిపై పలువురు విమర్శలు గుప్పించారు. మరికొందరు అభినందించారు. తాజాగా మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇటీవల తీసుకొన్న నిర్ణయంపై అక్కడి మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వారిపై పాక్ మాజీ కెప్టెన్, మాజీ కోచ్ మిస్బా ఉల్ హక్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. జాతీయ క్రికెట్ జట్టుకు మిక్కీ ఆర్థర్ను కోచ్గా తిరిగి నియమించడం ‘పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురు దెబ్బ’గా పేర్కొన్నాడు. పీసీబీ చీఫ్ నజామ్ సేథీ వచ్చిన తర్వాత క్రికెట్ జట్టులో పలుమార్పులకు శ్రీకారం చుట్టారు. చీఫ్ సెలక్టర్ను తప్పించడంతోపాటు కోచ్నూ మార్చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మిక్కీ ఆర్థర్ను హెడ్ కోచ్/డైరెక్టర్గా నియమిస్తూ ప్రకటన జారీ చేశారు. అయితే ఆర్థర్ ఇప్పుడే అందుబాటులోకి రాలేడు. దీనిపై మిస్బా స్పందించాడు. పీసీబీ క్రికెట్ వ్యవస్థ విశ్వసనీయతను పాక్ మాజీ ఆటగాళ్లు దెబ్బతీశారని.. అందుకే కోచింగ్ బాధ్యతలను అప్పగించడానికి పీసీబీ విదేశీయుల వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నాడు.
‘‘ఇది మా పాకిస్థాన్ క్రికెట్ వ్యవస్థకు చెంపదెబ్బ. పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వర్తించే అత్యుత్తమ కోచ్ను నియమించుకోలేకపోతున్నాం. అలాగే నాణ్యమైన క్రికెటర్లు ఎవరూ కూడా ముందుకు రాకపోవడం సిగ్గు చేటు. వారంతా పాక్ను రెండో ఆప్షన్గానే చూడటం సరైంది కాదు. నేను మా సొంత క్రికెట్ వ్యవస్థనే తప్పుబడుతున్నా. పాక్ క్రికెట్ ఇమేజ్ను దెబ్బతీసేలా మన క్రికెటర్లను మనమే అగౌరవపర్చుకొనేలా చర్యలకు దిగడాన్ని తప్పుబడుతున్నా. ప్రస్తుతం ఉన్నవారితోపాటు మాజీ ఆటగాళ్లు కూడా ఒకరినొకరు గౌరవించుకోరు. మీడియా, యూట్యూబ్ ఛానెళ్ల రేటింగ్ కోసం విలువలను, విశ్వసనీయతను దెబ్బతీసుకుంటున్నారు. దీని ఫలితంగా కోచింగ్ ఇచ్చేంత సామర్థ్యం కలిగిన ఆటగాళ్లు ఇక్కడ లేరనే అభిప్రాయాన్ని అందరిలోనూ కలిగించారు. ప్రస్తుతం విజయవంతమైన జట్లలో ఒకటైన టీమ్ఇండియా కూడా దేశీయ కోచ్ వైపే మొగ్గు చూపింది. అయితే ఇక్కడ మాత్రం పాలసీలు దారుణంగా ఉన్నాయి. మహమ్మద్ అక్రమ్, ఆకిబ్ జావెద్, ఇంజమామ్ ఉల్ హక్, వకార్ యూనిస్.. ఇలా చాలామంది అత్యుత్తమ దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. వీరంతా కోచ్లుగా పనిచేశారు. కానీ వీరిని ఘోరంగా అవమానించడం బయటకు పంపారు. ఈ బాధ్యతలకు సరైనవారు కాదనే అభిప్రాయాన్ని ప్రజల్లో వచ్చేలా చేయడంలో కొందరు విజయవంతమయ్యారు’’ అని మిస్బా వ్యాఖ్యానించాడు.
పీసీబీ అప్పగించిన హెడ్ కోచ్/డైరెక్టర్ బాధ్యతలను చేపట్టడానికి ఆర్థర్కు అడ్డంకులు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్థర్ డెర్బీషైర్ కౌంటీ జట్టుకు కోచ్గా ఉన్నాడు. ఒకవేళ పీసీబీ, కౌంటీ అంగీకరిస్తూ.. రెండు జట్లకూ కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తాడు. అలా కుదరకపోతే మాత్రం అతడు పాకిస్థాన్ జట్టుతో కలవలేడు. కానీ ఆన్లైన్ వేదికగానీ, తన తరఫున మరొక వ్యక్తిని నియమించి కార్యకలాపాలను చూసే అవకాశం లేకపోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
కేసీఆర్ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు