Mitchell Marsh-WORLD CUP: వరల్డ్ కప్పై మిచెల్ మార్ష్ కాళ్లు.. మీరు మారరంటూ నెట్టింట ట్రోలింగ్
వరల్డ్ కప్ను (ODI World Cup 2023) ఆసీస్ నెగ్గినా.. ఆ జట్టు ఆటగాళ్లు మాత్రం ట్రోఫీకి గౌరవం ఇవ్వడం లేదు. ఇప్పుడిదే సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురైంది.
(ఫొటో సోర్స్: కమిన్స్ ఇన్స్టా)
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్ను (ODI World Cup 2023) ఆస్ట్రేలియా ఆరోసారి కైవసం చేసుకుంది. ఫైనల్లో భారత్పై గెలిచి కప్ను ఎగరేసుకుపోయింది. ఈ సందర్భంగా ఆసీస్ ఆటగాడు మిచెల్ మార్ష్ సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురయ్యాడు. ప్రపంచ కప్పై అతడు కాళ్లు పెట్టిన ఫొటోలు నెట్టింట హల్చల్ చేశాయి. తొలుత ఈ ఫొటోలు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టడంతో వైరల్గా మారాయి. ఆ చిత్రంలో వరల్డ్ కప్పై కాళ్లు పెట్టి సేదతీరుతూ, డ్రింక్ తాగుతూ మిచెల్ మార్ష్ కనిపించాడు. దీంతో 2006లోనూ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్ను కాస్త పక్కకు నెట్టిన సంఘటనను అభిమానులు గుర్తుకు తెచ్చుకున్నారు. ఎన్ని గెలిచినా.. మీ ప్రవర్తనలో మాత్రం మార్పు రాదంటూ విమర్శలు గుప్పించారు.
గతేడాది మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా ఫుట్బాల్ ప్రపంచ కప్ను గెలిచిన సంగతి తెలిసిందే. అప్పుడు మెస్సీ ఆ కప్ను ఎంతో అపురూపంగా చూసుకుంటూ తన రూమ్లో దిగిన ఫొటోలు వైరల్గా మారాయి. దీంతో మెస్సీకి ఇప్పుడు మిచెల్ చేసినదానికి వ్యత్యాసం ఇందంటూ అభిమానులు ట్రోలింగ్కు దిగారు.
‘‘అది వరల్డ్ కప్.. దయ చేసి గౌరవం ఇవ్వండి’’
‘‘విజేతగా నిలవడానికి వారు అర్హులే. కానీ, ఇలా ప్రవర్తించడం మాత్రం దారుణం. వారి స్థాయి దిగజారిపోతోంది’’
‘‘ట్రోఫీని గౌరవించకపోతే.. వారు విజేతలుగా నిలిచినా ప్రయోజనం లేదు. మిచెల్ మార్ష్ నువ్వు చేసిన పనికి సిగ్గుపడాలి’’
‘‘దిగ్గజాల నుంచి మిచెల్ చాలా నేర్చుకోవాలి. క్రికెట్ గాడ్ సచిన్ చివరి సారిగా వరల్డ్ కప్ను ముద్దాడిన తీరు ఇప్పటికీ గుర్తుండిపోతుంది’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
IND vs SA: దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్.. మూడు ఫార్మాట్లకు ముగ్గురు సారథులు
దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టును (IND vs SA) బీసీసీఐ ప్రకటించింది. మూడు ఫార్మాట్లకు ముగ్గురిని సారథులుగా నియమించింది. -
MS Dhoni: ఆ విషయంలో ధోనీ అందరి అంచనాలను తల్లకిందులు చేశాడు: డివిలియర్స్
మిస్టర్ కూల్ కెప్టెన్ ధోనీ (MS Dhoni)పై దక్షిణాఫ్రికా మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మరో మూడు సీజన్లు ఆడే సత్తా ధోనీకి ఉందని అంచనావేశాడు. -
Ashish Nehra: టీ20లకు భారత్ కోచ్ పదవి.. ఆశిశ్ నెహ్రా వద్దనడానికి కారణాలు ఇవేనా?
గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిశ్ నెహ్రాను (Ashish Nehra) టీమ్ఇండియా కోచింగ్ పదవి వరించినా.. వద్దని చెప్పడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేశాయి. -
Cricket News: ఇప్పుడెందుకు ఈ టీ20 సిరీస్..? పందెం కోల్పోయానంటున్న కెవిన్.. టీమ్ఇండియాతోనూ బజ్బాల్!
-
Rahul Dravid: ‘టీ20 ప్రపంచకప్ ఉన్న ఈ తరుణంలో’.. కోచ్గా ద్రవిడ్ కొనసాగింపుపై గంభీర్ స్పందన
Rahul Dravid: టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా ఇతర కోచింగ్ బృంద కాంట్రాక్ట్ను బీసీసీఐ పొడిగించింది. దీనిపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తాజాగా స్పందించారు. -
Rahul Dravid: ఇన్నింగ్స్ ఇంకా ఉంది
సందిగ్ధత తొలగింది. ఊహాగానాలకు తెరపడింది. టీమ్ఇండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ కొనసాగనున్నాడు. అతడి కాంట్రాక్ట్ను పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది. వీవీఎస్ లక్ష్మణ్ ఎన్సీఏలోనే ఉంటాడు. -
Dravid: మెప్పించాడు ఇలా...
జూనియర్ కోచ్గా, ఎన్సీఏ అధిపతిగా తనదైన ముద్ర వేసినా, మంచి పేరు తెచ్చుకున్నా ద్రవిడ్ ఏనాడు టీమ్ఇండియా కోచ్ పదవిపై ఆసక్తిని ప్రదర్శించలేదు. బీసీసీఐ పెద్దలు ప్రయత్నించినా ఎందుకో అతడు విముఖత వ్యక్తం చేశాడు. కానీ ద్రవిడ్ ఒకప్పటి సహచరుడైన గంగూలీ (అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు).. రవిశాస్త్రి అనంతరం కోచ్గా ఉండేలా ద్రవిడ్ను ఒప్పించగలిగాడు. -
Rohit Sharma: మరి రోహిత్?
దక్షిణాఫ్రికా పర్యటన కోసం సెలక్షన్ కమిటీ గురువారం భారత జట్లను ప్రకటించనుంది. టీ20ల్లో తిరిగి భారత్కు నాయకత్వం వహించాలని రోహిత్ శర్మను బీసీసీఐ పెద్దలు ఒప్పించడానికి ప్రయత్నించే అవకాశముంది. 2022 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ ఓడినప్పటి నుంచి రోహిత్ పొట్టి క్రికెట్కు దూరంగా ఉన్నాడు. -
IND vs AUS: ఇలాంటి పరిస్థితుల్లో ఎంతైనా ఛేదించొచ్చు
ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత పేసర్ల వైఫల్యానికి విపరీతమైన మంచు కారణమని ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓవర్కు 14 పరుగుల లక్ష్య ఛేదన కూడా సాధ్యమేనని తెలిపాడు. 222 స్కోరును కాపాడుకోలేకపోయిన భారత్.. చివరి 5 ఓవర్లలో 80 పరుగులు సమర్పించుకుంది. -
ఆ అనుభవం ఉపయోగపడుతుంది
గొప్ప సారథుల ఆధ్వర్యంలో ఆడిన అనుభవం తనకెంతో ఉపయోగపడుతుందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ అన్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్శర్మ సారథ్యంలో ఆడిన గిల్.. ఐపీఎల్లో తొలిసారిగా నాయకత్వం వహించనున్నాడు. -
వచ్చే ఏడాది శ్రీలంకకు టీమ్ఇండియా
సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ)కు శుభవార్త. వచ్చే ఏడాది జులై- ఆగస్టులో శ్రీలంకలో భారత జట్టు పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడేసి వన్డేలు.. టీ20ల్లో భారత్, శ్రీలంక తలపడతాయని 2024 వార్షిక క్యాలెండర్లో ఎస్ఎల్సీ పేర్కొంది. వచ్చే ఏడాది శ్రీలంక 52 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనుంది. -
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్
ముంబయి ఇండియన్స్ (MI) జట్టులో ఏం జరుగుతుందనేది అభిమానుల్లో ఉత్కంఠగా మారింది. బుమ్రా పెట్టిన పోస్టుపై జట్టునే ఒక కుటుంబంగా భావించే మేనేజ్మెంట్ ఎలా స్పందిస్తుందో అందరిలోనూ మెదిలే ప్రశ్న. -
విలియమ్సన్ సెంచరీ
బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. ఆతిథ్య బంగ్లాదేశ్ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన కివీస్కు.. బ్యాటుతో ఇబ్బందులు తప్పలేదు. ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లాం (4/89) సత్తా చాటడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 8 వికెట్లకు 266 పరుగులు సాధించింది.


తాజా వార్తలు (Latest News)
-
COP28: చేతల్లో చేసి చూపెట్టాం.. ‘వాతావరణ చర్యల’పై ప్రధాని మోదీ
-
Nimmagdda Ramesh: ఓట్ల గల్లంతుపై ఫిర్యాదులు.. ఏపీ ప్రజలకు నిమ్మగడ్డ కీలక సూచన
-
Social Look: వాణీ కపూర్ ‘పిల్లో టాక్’.. తేజస్విని ‘కెమెరా’ స్టిల్!
-
IND vs SA: దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్.. మూడు ఫార్మాట్లకు ముగ్గురు సారథులు
-
Nayanthara: నయనతారకు విఘ్నేశ్ ఖరీదైన బహుమతి.. అదేంటంటే?
-
Exit polls: భాజపా ఖాతాలోకి రాజస్థాన్.. మధ్యప్రదేశ్లో హోరాహోరీ!