Mithali Raj: మహిళల క్రికెట్లో సరికొత్త చరిత్ర
టీమ్ఇండియా మహిళా జట్టు సారథి మిథాలిరాజ్ అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా సరికొత్త చరిత్ర సృష్టించింది. గతరాత్రి ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డేలో ఆమె...
పరుగుల దాహం తీరలేదు: మిథాలి రాజ్
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా మహిళా జట్టు సారథి మిథాలిరాజ్ అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా సరికొత్త చరిత్ర సృష్టించింది. గతరాత్రి ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డేలో ఆమె (75 నాటౌట్; 86 బంతుల్లో 8x4) పరుగులు చేసి అన్ని ఫార్మాట్లలో కలిపి 10,337 పరుగులు సాధించింది. దాంతో ఇంతకుముందు అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఛార్లెట్ ఎడ్వర్డ్స్ 10,273 ను టీమ్ఇండియా సారథి అధిగమించింది. అయితే, తనకింకా పరుగుల దాహం తీరలేదని.. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్లోనూ మరింత బాగా ఆడేందుకు కృషి చేస్తానని ఆమె చెప్పింది. మ్యాచ్ అనంతరం వర్చువల్లో మిథాలి మీడియాతో మాట్లాడారు.
‘ఈ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. ఎన్నో ఒడుదొడుకులు.. సవాళ్లు. మధ్యలో చాలాసార్లు ఆటకు వీడ్కోలు చెప్పాలనుకున్నా. కానీ.. ఏదో విషయం నన్ను ముందుకు సాగేలా చేసింది. దాంతో ఇలా 22 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్నా. అయితే, ఇప్పటికీ నాకు పరుగులు చేయాలనే దాహం తీరలేదు. టీమ్ఇండియాకు మరిన్ని విజయాలు అందించాలనుకుంటున్నా. అలాగే నా బ్యాటింగ్లోనూ కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయని తెలుసు. ఇప్పుడు వాటిమీదే దృష్టిసారించాను’ అని మిథాలి వివరించింది.
ఇక మూడో వన్డేలో తనకు సహకరించిన ఆల్రౌండర్ స్నేహ రాణా గురించి మాట్లాడుతూ.. ఏడోస్థానంలో ఆమెలాంటి క్రికెటర్ గురించే తాము వేచి చూశామని పేర్కొంది. నిన్నటి మ్యాచ్లో స్నేహ(24; 22 బంతుల్లో 3x4) బాగా ఆడిందని, ఆమెతో నెలకొల్పిన అర్ధశతక భాగస్వామ్యం చాలా విలువైందని చెప్పింది. ఇక హర్మన్ ప్రీత్కౌర్ ఫామ్ కోల్పోవడంపై స్పందిస్తూ.. ప్రతి ఒక్కరూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారని తెలిపింది. అయితే, ఒక జట్టుగా అలాంటి క్రికెటర్లకు అండగా ఉంటామని భరోసా కల్పించింది.
ఇక ఇంగ్లాండ్తో ఆడిన వన్డే సిరీస్ను టీమ్ఇండియా 2-1 తేడాతో కోల్పోయినప్పటికీ.. మూడో మ్యాచ్లో గెలవడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని కెప్టెన్ ఆశాభావం వ్యక్తం చేసింది. రాబోయే టీ20 సిరీస్లో మరింత పట్టుదలగా పోరాడేందుకు ఈ విజయం స్ఫూర్తి నింపుతుందని చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.