Sir Mo Farah: ఓ వ్యథ.. ఓ మోసం.. ఓ ఛాంపియన్.. నాలుగు ఒలింపిక్ పతకాలు..!
విజయం.. మోడువారిన చెట్టు బెరడు నుంచి చీల్చుకొచ్చే చిగురు వంటింది. ఎన్ని కష్టాలు ఎదురైనా పుట్టుకతోటే ఛాంపియన్లైనవారు భయపడరు. దీనికి 5,000 మీటర్లు,
మోఫరా విజయ గాథ ఇది..
ఇంటర్నెట్డెస్క్: విజయం.. మోడువారిన చెట్టు బెరడు నుంచి చీల్చుకొచ్చే చిగురు వంటింది. ఎన్ని కష్టాలు ఎదురైనా విజయం సాధించడానికి పుట్టిన వారు భయపడరు. దీనికి 5,000 మీటర్లు, 10,000 మీటర్ల పరుగులో నాలుగు ఒలింపిక్స్ స్వర్ణాలు సాధించిన ఓ ఛాంపియన్ జీవితమే ఉదాహరణ.
సోమాలియా అంతర్యుద్ధంలో తండ్రిని కోల్పోయి బిక్కుబిక్కు మంటూ జీవిస్తున్న ఓ తొమ్మిదేళ్ల చిన్నారిని యూకేలోని చుట్టాలింటికి చేరుస్తానని ఆశచూపిందో మహిళ. ఆ చిన్నారి గంపెడు ఆశతో యూకేలోని బంధువుల చిరునామా తీసుకొని ఆ మహిళ వెంట జబూటీ చేరుకొన్నాడు. అక్కడి నుంచి అక్రమంగా యూకేకు తీసుకొచ్చారు. కానీ, చుట్టాలింటికి చేర్చలేదు. బలవంతంగా వెట్టిచాకిరీ చేయించారు. కానీ, కాలక్రమంలో ఆ చిన్నారే కష్టాలను జయించి యూకే ఛాంపియన్గా నిలిచాడు. రెండు ఒలింపిక్స్ల్లో యూకేకు ఏకంగా నాలుగు బంగారు పతకాలు తీసుకొచ్చాడు. బ్రిటన్లో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘సర్’ బిరుదును అందుకొన్నాడు. అతడే ‘సర్ మోఫరా’..! తాజాగా ఆయన ఓ ఆంగ్ల పత్రికతో తన జీవితంలోని చీకటి రోజులను పంచుకొన్నాడు.
సోమాలియాలో అంతర్యుద్ధం జరుగుతున్న సమయంలో ఫరా తండ్రి అబ్దిని అక్కడ దుండగులు కాల్చి చంపారు. అప్పుడు ఫరా వయస్సు నాలుగేళ్లు. వారి కుటుంబం సోమాలియా నుంచి విడిపోయిన సోమాలిల్యాండ్లో జీవిస్తోంది. ఆ దేశం 1991లో స్వాతంత్ర్యం ప్రకటించుకొన్నా.. ప్రపంచం గుర్తించలేదు. ఫరాకు తొమ్మిదేళ్ల వయస్సులో ఓ కుటుంబం సోమాఐల్యాండ్ నుంచి అతన్ని సమీపంలోని జబూటీకి
తీసుకెళ్లింది. అక్కడ ఓ గుర్తుతెలియని మహిళ యూకేలోని బంధువుల వద్దకు తీసుకెళతానని ఆశచూపింది. జీవితంలో అనుకోని అదృష్టం వచ్చినందుకు ఫరా సంతోషించాడు. ట్రావెల్ పత్రాల్లో అతని పేరు ముందు మహమ్మద్ అని చేర్చారు. దీంతో అతని పేరు మహమ్మద్ ఫరా అయింది. ఆ తర్వాత అతడి పేరు మోఫరాగా మారింది.
మోఫరా ఆ మహిళతో కలిసి యూకే చేరుకొన్నాక.. పశ్చిమ లండన్ హాన్స్లోని ఓ ఫ్లాట్కు తీసుకెళ్లింది. అక్కడ ఫరా వద్ద ఉన్న బంధువుల చిరునామా తీసుకొని చించేసింది. ఈ ఘటనతో తాను మోసపోయానని గ్రహించిన ఫరాకు ఏడుపొచ్చింది. అనంతరం అతని చేత ఇంటిపని, తన పిల్లలకు సంబంధించిన పనులను ఆ మహిళ చేయించడం మొదలుపెట్టింది. భవిష్యత్తులో మీ కుటుంబాన్ని చూడాలనుకుంటే మారు మాట్లాడవద్దని హెచ్చరించింది. దీంతో గత్యంతరం లేక ఫరా ఆ పనులను చేసేవాడు. తరచూ బాధను తట్టుకోలేక బాత్రూమ్లో కి వెళ్లి గంటల కొద్దీ వెక్కివెక్కి ఏడ్చేవాడు.
అతడికి క్రీడా భాషే అర్థమైంది..!
ఫరాకు 12ఏళ్లు వచ్చే వరకు స్కూల్లో చేర్చలేదు. ఆ తర్వాత ఫెల్థామ్ కమ్యూనిటీ కాలేజీలో ‘ఇయార్-7’లో చేర్చారు. అక్కడి సిబ్బందికి సోమాలియా శరణార్థిగా పరిచయం చేశారు. ఫరా ఆ విద్యాలయానికి మాసిన దుస్తులతో వచ్చేవాడు. అతడికి చాలా తక్కువ ఇంగ్లిష్ మాత్రమే వచ్చు. మిగిలిన విద్యార్థులకు దూరంగా ఉండేవాడు. అతడి తరపున ఎవరూ పేరెంట్స్ ఈవినింగ్స్కు హాజరయ్యేవారు కాదు. కానీ, ఫరాలో ప్రతిభను అక్కడి వ్యాయామ ఉపాధ్యాయుడు అలన్ వాట్కన్సన్ గుర్తించాడు. అతడికి ఇంగ్లిష్ రాకపోయినా కేవలం క్రీడా భాషను మాత్రమే అర్థం చేసుకొంటాడని గ్రహించాడు. ఫరా కూడా ప్రస్తతం దయనీయ జీవితం నుంచి బయటపడటానికి క్రీడలు ఒక్కటే మార్గమని భావించాడు. దీంతో తన జీవితంలోని వెట్టిచాకిరీ, మోసం వంటి చేదు గతాన్ని అలన్కు తెలియజేశాడు. వెంటనే అలన్ ఓ సామాజిక సంస్థతో మాట్లాడి ఫరాను వేరే సోమాలియా కుటుంబంతో ఉంచేందుకు ఏర్పాట్లు చేశాడు.
పౌరసత్వం కూడా అక్రమమే..
నాటి నుంచి మోఫరా జీవితం మారిపోయింది. క్రీడలపై దృష్టిపెట్టాడు. 14 ఏళ్ల వయస్సులో లాత్వియాలో ఇంగ్లిష్ స్కూల్స్ రేసులో పాల్గొనడానికి పిలుపు వచ్చింది. కానీ, ప్రయాణ పత్రాలు లేవు. దీంతో అలన్ మరోసారి సాయం చేశాడు. మహమ్మద్ ఫరా పేరుతో బ్రిటన్ పౌరసత్వానికి దరఖాస్తు చేశాడు. జులై 2000లో అది జారీ అయింది. వాస్తవానికి మోఫరా పౌరసత్వం కూడా అక్రమంగా లభించిందే అని అక్కడి న్యాయనిపుణులు చెబుతారు. చట్టపరంగా అతడి బ్రిటన్ జాతీయతను ఎప్పుడైనా తొలగించవచ్చు. కానీ, మోఫరాను చిన్నతనంలోనే మోసపూరితంగా అక్కడి చేర్చి.. వెట్టిచాకిరీకి వాడుకోవడంతో అతడికి అటువంటి రిస్కు చాలా తక్కువ. ఆ తర్వాత ఫరా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో నాలుగు బంగారు పతకాలు సాధించిన తొలి బ్రిటన్ అథ్లెట్గా చరిత్ర సృష్టించాడు. అతడి అంతర్జాతీయ క్రీడా చరిత్రలో మొత్తం 19 బంగారు, 9 రజత, 2 కాంస్య పతకాలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్