Tokyo Olympics: తలెత్తుకునేలా చేశారు.. బాధపడకండి..!
అద్భుతం సృష్టించే అవకాశాన్ని భారత మహిళల హాకీ జట్టు కోల్పోయినప్పటికీ.. స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసి దేశ ప్రజల మనసులు గెల్చుకుంది. రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు కూడా వారికి ఇవే మాటలు చెప్పి ఓదార్చారు. మీరు ముందు తరాలకు ఆదర్శమని కొనియాడారు.
మహిళల హాకీ జట్టు పోరాట పటిమను కొనియాడుతున్న ప్రముఖులు
దిల్లీ: అద్భుతం సృష్టించే అవకాశాన్ని భారత మహిళల హాకీ జట్టు కోల్పోయినప్పటికీ.. స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసి దేశ ప్రజల మనసులు గెల్చుకుంది. రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు కూడా వారికి ఇవే మాటలు చెప్పి ఓదార్చారు. ముందు తరాలకు వీరు ఆదర్శమని వారిని కొనియాడారు.
భారత మహిళల హాకీ జట్టు మైదానంలో అద్భుతంగా రాణించిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రశంసించారు. అద్భుతమైన ప్రదర్శనతో ప్రతి భారతీయుడి హృదయాన్ని గెల్చుకుందని, చాలా గర్వంగా ఉందని ఆయన ట్విటర్లో స్పందించారు.
ఉత్తమ నైపుణ్యాలను ప్రదర్శించారంటూ ప్రధాని మోదీ కొనియాడారు. ‘టోక్యో ఒలింపిక్స్లో మీరు ఆడిన తీరు ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. అత్యుత్తమంగా పోరాడారు. ప్రతి ఒక్కరు గొప్ప తెగువ, నైపుణ్యాల్ని కనబర్చారు. మీ అద్భుత ప్రదర్శన పట్ల దేశం గర్విస్తోంది. పతకాన్ని కోల్పోయినప్పటికీ.. హద్దుల్ని చెరిపేశారు. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు హాకీ స్టిక్ పట్టుకునేందుకు ప్రేరణగా నిలిచారు’ అని ప్రధాని ప్రశంసించారు.
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ స్పందిస్తూ..‘ బాధాకరమే!! కానీ మీ ప్రదర్శనతో తలెత్తుకునేలా చేశారు. దేశంలో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి నిచ్చారు. అది కూడా విజయమే’ అంటూ ఓదార్చారు. మరోపక్క మన వాళ్లు చూపిన పోరాట పటిమను గ్రేట్ బ్రిటన్ హాకీ పొగిడింది. ‘అద్భుతమైన ఆట. అంతే అద్భుతమై ప్రత్యర్థి. టోక్యో ఒలింపిక్స్లో మీరు ప్రత్యేకంగా నిలిచారు’ అంటూ అభినందనలు తెలిపింది.
మంత్రి కేటీఆర్ ప్రశంసలు..
‘అద్భుతంగా పోరాడిన మహిళల హాకీ బృందానికి అభినందనలు. మీ పోరాట స్ఫూర్తితో దేశ ప్రజల హృదయాలను గెల్చుకున్నారు. ప్రపంచ వేదికపై పోటీలో నిల్చేందుకు ఆడపిల్లలకు ప్రేరణగా నిల్చారు’ అని కేటీఆర్ ప్రశంసించారు.
ఈ రోజు కాంస్యం కోసం జరిగిన పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ బ్రిటన్కు గట్టిపోటీనిచ్చి, భారత్ ఆఖరువరకు పోరాడింది. అయితే కీలక సమయాల్లో పొరపాట్లు చేయడం, పీసీలను గోల్స్గా మలచకపోవడంతో టీమ్ఇండియా విజయానికి దూరమైంది. బ్రిటన్పై 4-3 తేడాతో పరాజయం చవిచూసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్