Mohammad Rizwan: ప్రపంచంలోనే అత్యంత కఠినమైంది పాకిస్థాన్ లీగ్ : మహమ్మద్ రిజ్వాన్
ఒకప్పుడు అంతా భారత టీ20 లీగ్ గురించే మాట్లాడుకునేవారని.. పాకిస్థాన్ లీగ్ ఆ పరిస్థితులను మార్చేసిందని మహమ్మద్ రిజ్వాన్(Mohammad Rizwan) అన్నాడు.
కరాచీ: పాక్ నిర్వహిస్తున్న లీగ్ ప్రపంచంలోనే అత్యుత్తమమైందని పాక్ స్టార్బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్(Mohammad Rizwan) పేర్కొన్నాడు. భారత్లోని లీగ్పై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘లీగ్ల ప్రస్తావన వస్తే ఒకప్పుడు అంతా భారత టీ20 లీగ్(T20 League) గురించే మాట్లాడుకునేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు. ప్రపంచంలోనే పాకిస్థాన్ సూపర్ లీగ్ అత్యంత కఠినమైందిగా నిలిచింది. ఒకసారి పాకిస్థాన్ లీగ్లో ఆడితే ఎవరైనా ఇదే మాట అంటారు. ఎందుకంటే మా లీగ్లో బెంచ్పై రిజర్వ్ ఆటగాళ్లు సైతం అద్భుతంగా ఆడగలరు. మా లీగ్ ప్రపంచం మొత్తాన్నీ ఆశ్చర్యపరిచింది. ప్రారంభ రోజుల్లో మా దేశంలో ఇది విజయవంతం కాదని చాలా మంది అన్నారు. కానీ, ఇప్పుడు దీనికి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు లభించాయి’’అని రిజ్వాన్ పేర్కొన్నాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ ఎనిమిదో ఎడిషన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది. ఈ లీగ్కు కరాచీ, ముల్తాన్, రావల్పిండి, లాహోర్ వేదికలు కానున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది మార్చ్లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమీజ్ రజా మాట్లాడుతూ తమ లీగ్ ఆదాయ వివరాలు వెల్లడించాడు. ఈ సీజన్లో లాభాలు 71 శాతం పెరిగాయని, టోర్నమెంట్ చరిత్రలోనే ఇదే అత్యధికమని తెలిపాడు. ఇందులో ఒక్కో ఫ్రాంఛైజీ దాదాపు రూ. 38 కోట్లు ఆర్జించిందని తెలిపాడు. లీగ్ చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంపై హర్షం వ్యక్తం చేశాడు. లాహోర్ నుంచి ఈ స్థాయిలో ప్రేక్షకుల మద్దతును తన జీవితంలో చూడలేదని తెలిపాడు.
పాకిస్థాన్ క్రికెట్లో రెండేళ్లుగా మహమ్మద్ రిజ్వాన్(Mohammad Rizwan) కీలక బ్యాటర్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఐసీసీ వెల్లడించిన ర్యాంకింగ్స్లోనూ టాప్ 2 బ్యాటర్ స్థానాన్ని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్తో పాటుగా పాకిస్థాన్ సూపర్ లీగ్, బిగ్ బాష్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ వంటి టోర్నీలను కూడా ఆడుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.