Cricketer of the Year: ఐసీసీ టీ20 ఉత్తమ క్రికెటర్గా పాక్ ఆటగాడు
కెట్లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా పాక్ బ్యాటర్, వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యాడు......
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా పాక్ బ్యాటర్, వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆదివారం ప్రకటించింది. 2021లో 29 టీ20 మ్యాచ్లు ఆడిన రిజ్వాన్ అత్యుత్తమ ఫామ్ను కొనసాగిస్తూ.. 134.89 స్ట్రైక్ రేట్తో 1,326 పరుగులు సాధించాడు. ఏకంగా 73.66 సగటుతో ఈ రన్స్ చేయడం విశేషం.
గతేడాది జరిగిన ప్రపంచకప్లోనూ రిజ్వాన్ తన ఫామ్ను కొనసాగిస్తూ.. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీలో పాక్ ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. ఇందులో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రిజ్వాన్ నిలిచాడు. గతేడాది మొదటినుంచి పరుగుల వరద పారిస్తూ వస్తున్నాడు. లాహోర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో సెంచరీ సాధించి.. టీ20ల్లో కెరీర్లోనే తొలి శతకం నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా తన దూకుడును కొనసాగించాడు. వెస్టిండీస్తో కరాచీలో జరిగిన పోరులో 87 పరుగులు సాధించాడు. రానున్న ప్రపంచకప్లోనూ రిజ్వాన్ తన ఉత్తమ ఆటతీరును కొనసాగించాలని పాక్ కోరుకుంటోంది.
బ్యాటింగ్లో అత్యుత్తమంగా రాణించిన ఇంగ్లాండ్ క్రీడాకారిణి, వికెట్ కీపర్ ట్యామీ బ్యూమోంట్ ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎన్నికైంది. వీటితోపాటు మరిన్ని పురస్కారాలను ఐసీసీ ప్రకటించింది. మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్గా దక్షిణాఫ్రికా ఆటగాడు జాన్నెమన్ మలన్ను ఐసీసీ ఎంపిక చేసింది. మెన్స్ అసోసియేట్ క్రికెటర్గా ఒమన్ ఆల్రౌండర్ ఆటగాడు జీషన్ మక్సూద్ను ఎన్నుకుంది. బ్యాటింగ్, బౌలింగ్తో జట్టుకు ఉత్తమ సేవలందించినందుకు గానూ ఈ పురస్కారాన్ని అందజేయనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కోహ్లి ముఖంలో ఆనందం చూశా
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముఖంలో ఆనందం చూశానని కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. -
సబ్స్టిట్యూట్గా వచ్చి గెలిపించాడు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన తంజిద్ హసన్ (84; 81 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు మెరిపించడంతో సోమవారం ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. -
ఐపీఎల్ ఆరంభంలో పంత్కు కష్టమే
రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రిషబ్ పంత్కు.. ఈ ఐపీఎల్ ఆరంభంలో ఇబ్బందులు తప్పవని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ప్రపంచ రికార్డుతో అఖిల్కు పసిడి
భారత షూటర్ అఖిల్ షెరోన్ అదరగొట్టాడు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం గెలిచిన అతను.. తాజాగా పోలిష్ గ్రాండ్ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. -
సర్ఫరాజ్, జురెల్లకు బీసీసీఐ కాంట్రాక్టులు
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్కీపర్ ధ్రువ్ జురెల్కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించాయి. గ్రూప్-సిలో ఉన్న ఈ ఆటగాళ్లు ఫీజు కింద ఏడాదికి కోటి రూపాయలు పొందుతారు.