IND Vs BAN : వన్డే సిరీస్కు ముందు టీమ్ఇండియాకు షాక్.. షమీ ఔట్
గాయం కారణంగా సీనియర్ పేసర్ షమీ బంగ్లాతో వన్డే సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ ట్వీట్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్తో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. గాయం కారణంగా సీనియర్ పేసర్ షమీ ఈ సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. బీసీసీఐ ఈ మేరకు ట్వీట్ చేసింది. భుజం గాయంతో షమీ ఇబ్బందిపడుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. షమీ స్థానంలో భారత యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్కు జట్టులో చోటు కల్పించారు.
‘‘బంగ్లాతో వన్డే సిరీస్కు ముందు నిర్వహించిన ట్రైనింగ్ సెషన్లో షమీకి గాయమైంది. అతడు ప్రస్తుతం ఎన్సీఏ పర్యవేక్షణలో ఉన్నాడు. బంగ్లాదేశ్కు వెళ్లే టీమ్తో అతడు వెళ్లలేదు’ అని బీసీసీఐ తెలిపింది. అయితే అతడి గాయం తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలియరాలేదు.
వన్డే సిరీస్తోపాటు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్కూ షమీ దూరమయ్యే అవకాశాలు ఉండటం ఇప్పుడు జట్టులో ఆందోళన కలిగిస్తోంది. ‘వన్డే సిరీస్కు షమీ లేకపోవడం పెద్ద లోటే. అయితే.. బుమ్రా గైర్హాజరిలో టెస్టు సిరీస్కూ అతడు దూరమైతే ఇది అంతకంటే పెద్ద ఆందోళనే’ అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఎందుకంటే జూన్లో ఓవల్లో జరగబోయే ప్రపంచకప్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో ఉండాలంటే.. టీమ్ ఇండియా ప్రతి మ్యాచ్ గెలవాల్సిన అవసరం ఉంది. షమీ ఇప్పటి వరకూ 60 టెస్టు మ్యాచ్ల్లో 216 వికెట్లు పడగొట్టాడు.
ఇక బంగ్లా పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.
బంగ్లాతో వన్డేలకు టీమ్ఇండియా జట్టు ఇదే.. : రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైఎస్ కెప్టెన్), ధావన్, కోహ్లీ, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్సేన్, ఉమ్రాన్ మాలిక్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.