సిరాజ్ ‘ట్రెండ్’ సెట్ చేశాడు!
క్రికెట్లో జాత్యహంకారానికి చోటు లేదని ఆస్ట్రేలియా స్పిన్నర్ నేథన్ లైయన్ అన్నాడు. సిడ్నీ టెస్టులో టీమిండియా యువపేసర్ మహ్మద్ సిరాజ్ను లక్ష్యంగా చేసుకుని కొందరు ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు....
ఇంటర్నెట్డెస్క్: క్రికెట్లో జాత్యహంకారానికి చోటు లేదని ఆస్ట్రేలియా స్పిన్నర్ లైయన్ అన్నాడు. సిడ్నీ టెస్టులో టీమిండియా యువపేసర్ మహ్మద్ సిరాజ్ను లక్ష్యంగా చేసుకుని కొందరు ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మ్యాచ్ అధికారులకు సిరాజ్ ఫిర్యాదు చేయగా ఆకతాయిల్ని సెక్యూరిటీ సిబ్బంది స్టేడియం బయటకు పంపించింది. ఈ నేపథ్యంలో జాతివివక్షపై లైయన్ మాట్లాడాడు. క్రికెట్లో సిరాజ్ కొత్త ప్రమాణాన్ని నెలకొల్పాడని తెలిపాడు. వివక్షకు గురైతే ఆటను నిలిపివేసి, ఆకతాయిల్ని స్టేడియం బయటకి పంపించే అవకాశం ఆటగాళ్లకు ఉందని అతడు తెలియజేశాడని చెప్పాడు.
‘‘క్రికెట్లో జాత్యహంకారానికి, దూషణకు చోటు లేదు. ఇలా చేయడం ప్రజలు ఫన్నీగా భావిస్తారు. కానీ ఇది ఆటగాళ్లను ఎంతో ప్రభావితం చేస్తుంది. సిరాజ్కు జరిగిన సంఘటన బాధాకరం. గతంలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా పర్యటనల్లో నేనూ అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను. సాధ్యమైనంత వరకు అవి జరగకుండా ప్రయత్నించాలి. అయితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వాటిని మ్యాచ్ అధికారుల వద్దకు తీసుకువెళ్లాలి. ఎంతో మంది సెక్యూరిటీ సిబ్బంది స్టేడియంలో ఉంటారు. ఆకతాయిల్ని క్షణాల్లో స్టాండ్స్ నుంచి ఖాళీ చేయిస్తారు. అయితే ఆటగాళ్లకు అవాంఛనీయ సంఘటనలు ఎదురవ్వవని ఆశిస్తున్నా’’ అని లైయన్ పేర్కొన్నాడు.
సిడ్నీ టెస్టులో సిరాజ్తో పాటు బుమ్రా కూడా జాత్యహంకార వ్యాఖ్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మూడో రోజు ఆట అనంతరం టీమిండియా యాజమాన్యం ఈ విషయాన్ని ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా, మ్యాచ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. నాలుగో రోజు కూడా సిరాజ్ను లక్ష్యంగా చేసుకుని కొందరు ప్రేక్షకులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సిరాజ్ అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. ఆటను పది నిమిషాలు పాటు నిలిపివేసి ఆకతాయిల్ని సెక్యూరిటీ సిబ్బంది స్టేడియం బయటకు పంపింది.
ఇదీ చదవండి
ముగ్గురు మొనగాళ్లు.. మీ విలువకు సరిలేరు
స్మిత్ ఎంతో అమాయకుడట..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ