IND Vs SA : బుమ్రా స్థానంలో మహమ్మద్ సిరాజ్
బుమ్రా స్థానంలో హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ను సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది..
ఇంటర్నెట్డెస్క్ : వెన్ను గాయం కారణంగా టీమ్ఇండియా పేస్ గన్ బుమ్రా.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్తో పాటు టీ20 ప్రపంచకప్ టోర్నీకీ దూరమైన విషయం తెలిసిందే. దీంతో అతడి స్థానంలో హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. సఫారీలతో టీ20 సిరీస్ తదుపరి మ్యాచ్లకు అతడిని ఎంపిక చేసినట్లు ప్రకటించింది. మరోవైపు బుమ్రా గాయంపై కూడా బీసీసీఐ స్పష్టత ఇచ్చింది. ‘బుమ్రా వెన్ను గాయానికి గురయ్యాడు. అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు’ అని అధికారికంగా ప్రకటించింది.
వెన్ను గాయం కారణంగా బుమ్రా ఆగస్టు-సెప్టెంబరులో ఆసియాకప్నకు దూరమయ్యాడు. కోలుకున్న అతడు సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్తో పునరాగమనం చేశాడు. కానీ ఆ సిరీస్లోనూ తొలి మ్యాచ్లో ఆడలేదు. సెప్టెంబరు 23, 25వ తేదీల్లో రెండు, మూడో మ్యాచ్ల్లో ఆడాడు. గాయం తిరగబెట్టడంతో బుధవారం దక్షిణాఫ్రికాతో మొదటి టీ20లో ఆడలేదు. దక్షిణాఫ్రికాతో తొలి టీ20 టాస్కు కొద్ది నిమిషాల ముందు బుమ్రా గాయం గురించి బీసీసీఐ వెల్లడించింది. ‘మంగళవారం ప్రాక్టీస్ సెషన్ సమయంలోనే అతడు వెన్ను నొప్పి గురించి చెప్పాడు. బీసీసీఐ వైద్య బృందం అతడిని పరిశీలిస్తోంది. అతడు మ్యాచ్ ఆడటం లేదు’ అని బీసీసీఐ తెలిపింది. ఈ గాయం కారణంగా పొట్టి ప్రపంచకప్నకూ అతడు దూరమయ్యాడు.
ఇప్పటికే మోకాలి గాయం వల్ల ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మెగా టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు ఆటగాళ్లను కోల్పోవడం టీమ్ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బే అని విశ్లేషకులు అంటున్నారు. ఇక ప్రపంచకప్ జట్టులో బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడానికి ఫాస్ట్బౌలర్లు మహ్మద్ షమి, దీపక్ చాహర్ మధ్య పోటీ ఉంది. వీళ్లిద్దరూ ఇప్పటికే స్టాండ్బైలు అన్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు