T20 League: అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసింది వీళ్లే
టీ20 లీగ్ అంటేనే బ్యాట్స్మెన్కు పరుగుల పంట. బౌలర్లు ఎలాంటి బంతులేసినా వాటిని బౌండరీలకు తరలించడమే వారి పని. వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించి ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటారు...
పరుగుల వరద పారే టోర్నీలో మెరిసిన బౌలర్లు
టీ20 లీగ్ అంటేనే బ్యాట్స్మెన్కు పరుగుల పంట. బౌలర్లు ఎలాంటి బంతులేసినా వాటిని బౌండరీలకు తరలించడమే వారి పని. వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించి ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటారు. అయితే.. పలువురు బౌలర్లు అత్యుత్తమ గణాంకాలు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా మెయిడిన్ ఓవర్లు వేసి ఆకట్టుకున్నారు.
ప్రవీణ్ కుమార్ @ 14..
అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసింది ఒకప్పటి టీమ్ఇండియా మీడియం పేస్ బౌలర్ ప్రవీణ్కుమార్. అతడు 2008 నుంచి 2017 వరకు బెంగళూరు, పంజాబ్, ముంబయి, హైదరాబాద్ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలోనే 119 మ్యాచ్లు ఆడి 420.4 ఓవర్లు బౌలింగ్ చేశాడు. మొత్తం 90 వికెట్లు తీయడంతో పాటు 14 ఓవర్లు మెయిడిన్గా వేశాడు. అతడి సగటు 36.12 కాగా, ఎకానమీ 7.72. దీన్ని బట్టి ఎంత పొదుపుగా బౌలింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రవీణ్ 2017లో చివరిసారి ఈ టోర్నీలో ఆడినా ఇప్పటికీ లీగ్లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్గా ఉన్నాడు.
ఇర్ఫాన్ పఠాన్ @ 10..
ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది కూడా భారత ఆటగాడే. అతడే మాజీ పేస్ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. టోర్నీ ఆరంభ సీజన్ నుంచి 2017 వరకూ ఆడిన అతడు.. పంజాబ్, దిల్లీ, హైదరాబాద్, చెన్నై, పుణె, గుజరాత్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇర్ఫాన్ మొత్తం 103 మ్యాచ్ల్లో 340.3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అందులో 80 వికెట్లు తీయడమే కాకుండా 10 మెయిడిన్ ఓవర్లు సాధించాడు. సగటు 33.11 ఉండగా ఎకానమీ 7.77గా నమోదు చేశాడు. అతడు కూడా 2017లోనే చివరిసారి ఆడడం గమనార్హం.
భువనేశ్వర్ @ 9..
ఈ జాబితాలో ప్రస్తుత హైదరాబాద్ కీలక పేసర్ భువనేశ్వర్ కుమార్ మూడో స్థానంలో ఉన్నాడు. అతడు టోర్నీ ఆరంభం నుంచి ఆడుతున్నాడు. బెంగళూరు జట్టుతో అరంగేట్రం చేసిన భువి తర్వాత పుణె, ఆపై హైదరాబాద్ జట్లలో భాగమయ్యాడు. ఇక 2014 నుంచి హైదరాబాద్తోనే కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు మొత్తం 132 మ్యాచ్లు ఆడిన స్వింగ్ బౌలర్ 491.3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అందులో 142 వికెట్లు పడగొట్టడమే కాకుండా 9 మెయిడిన్ ఓవర్లు నమోదు చేశాడు. కాగా, 28.76 సగటుతో పై ఇద్దరికన్నా మెరుగ్గా ఉన్నాడు. ఎకానమీ 8.30గా నమోదైంది.
ఆ తర్వాత ఎవరున్నారంటే..
ఇక టాప్-3 తర్వాత మిగిలిన వారిలో ధావల్ కుల్కర్ణి, లసిత్ మలింగ, సందీప్ శర్మ 8 (సమానం) మెయిడిన్ ఓవర్లతో వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు. ఆపై డేల్ స్టెయిన్ 7, దీపక్ చాహర్, అమిత్ మిశ్రా, హర్భజన్ సింగ్, జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ 6 మెయిడిన్లతో కొనసాగుతున్నారు.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
ఎప్పుడూ కూల్గా కనిపించే ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని సురేశ్ రైనా ఇటీవల బయటపెట్టాడు. -
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు