IPL 2022: ప్రపంచకప్ గెలిచినా.. వేలానికి అనర్హులేనా..?
ఇటీవల టీమ్ఇండియా అండర్-19 ప్రపంచకప్ గెలిచినా అందులోని చాలా మంది యువకులు రాబోయే మెగా వేలంలో పాల్గొనేందుకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది...
(ఫొటో : బీసీసీఐ ట్విటర్ నుంచి)
ఇంటర్నెట్డెస్క్: ఇటీవల టీమ్ఇండియా అండర్-19 ప్రపంచకప్ గెలిచినా అందులోని చాలా మంది యువకులు రాబోయే మెగా వేలంలో పాల్గొనేందుకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అండర్-19 ఆటగాళ్లు ఐపీఎల్ వేలంలో పాల్గొనాలంటే బీసీసీఐ కొన్ని షరతులు విధించిన సంగతి తెలిసిందే. కచ్చితంగా దేశవాళీ క్రికెట్లో ఒక ఫస్ట్క్లాస్ మ్యాచ్ లేదా లిస్ట్-ఏ గేమ్ ఆడిన వారే అందుకు అర్హులు. ఒకవేళ దేశవాళీ క్రికెట్లో ఆడిన అనుభవం లేకపోతే.. వేలం జరిగే తేదీ నాటికి ఆయా క్రికెటర్లు 19 ఏళ్లు కలిగి ఉండాలి.
అయితే, ఇప్పుడు ప్రపంచకప్ గెలిచిన జట్టులో కనీసం 8 మంది ఆటగాళ్లు బీసీసీఐ పేర్కొన్న అర్హతలు సాధించలేకపోయారు. దీంతో ప్రపంచకప్ గెలవడంలో ముఖ్య భూమిక పోషించిన షేక్ రషీద్, దినేశ్ బానా, రవికుమార్, నిషాంత్ సింధు లాంటి కీలక ఆటగాళ్లు సైతం అవకాశం కోల్పోయే పరిస్థితి తలెత్తింది. మరోవైపు ఈ విషయంపై బీసీసీఐ త్వరలోనే సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బోర్డు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొంతకాలంగా కరోనా మహమ్మారి వల్ల దేశవాళీ క్రికెట్ మ్యాచ్లు జరగకపోవడమే అందుకు కారణమని వాళ్లు చెప్పారు. మరోవైపు ఈనెల 17 నుంచి ఈ సీజన్ రంజీ ట్రోఫీ మొదలవుతుండటంతో ఆయా రాష్ట్ర సంఘాలు తమ ఆటగాళ్లను ఎంపిక చేసినా అవకాశం ఉండదు. ఎందుకంటే మెగా వేలం 12, 13 తేదీల్లోనే నిర్వహిస్తున్నారు. ఇక ఈ మెగా వేలంలో మొత్తం 590 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. అందులో 228 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు.. మరో 355 మంది యువకులు ఉన్నారు. మరో ఏడుగురు అసోసియేట్ దేశాల క్రికెటర్లూ ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు