INDvsSL: బంతులేస్తే వికెట్లు పడాల్సిందే!
టీమ్ఇండియా, శ్రీలంక జట్లు మరికొద్ది రోజుల్లో పరిమిత ఓవర్ల సిరీసులు ఆడేందుకు సిద్ధపడుతున్నాయి. దాంతో ఆటగాళ్లంతా కఠినమైన బయోబుడగలో ఉంటూ తమ సాధన కొనసాగిస్తున్నారు...
భారత్ X శ్రీలంక జట్ల మధ్య అత్యధిక వికెట్ల వీరులు..
టీమ్ఇండియా, శ్రీలంక జట్లు మరికొద్ది రోజుల్లో పరిమిత ఓవర్ల సిరీసులు ఆడేందుకు సిద్ధపడుతున్నాయి. దాంతో ఆటగాళ్లంతా కఠినమైన బయోబుడగలో ఉంటూ తమ సాధన కొనసాగిస్తున్నారు. భారత జట్టు యువ ఆటగాళ్లతో కళకళలాడుతుండగా లంక తమ అనుభవజ్ఞులతో బరిలోకి దిగనుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో టీమ్ఇండియా ఫేవరెట్గా కనిపిస్తున్నా సొంత గడ్డపై లంకను తక్కువ అంచనా వేయకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ఇండియా విజయం సాధించాలంటే బ్యాట్స్మెన్తో పాటు బౌలర్లూ రాణించాలి. అలా ఇరు జట్ల మధ్య ఇదివరకు చెలరేగి మ్యాచ్ విన్నర్లుగా ఎదిగిన టాప్ బౌలర్ల గురించి మనమిప్పుడు తెలుసుకుందాం..
ముత్తయ్య ముందు..
క్రికెట్లో ముత్తయ్య మురళీధరన్ అంటే తెలియనివారుండరు. అతని స్పిన్ బౌలింగ్కు బోల్తాపడని జట్టుండదు! బ్యాటింగ్లో సచిన్ ఎలాగో బౌలింగ్లో ఈ శ్రీలంక మాజీ స్పిన్నర్ అలాగ. అంతర్జాతీయ క్రికెట్లో 800 వికెట్లు తీసి బౌలింగ్లో ఏకఛత్రాధిపతిగా నిలిచాడు. ఈ క్రమంలోనే స్పిన్ బౌలింగ్ను అలవోకగా ఆడే టీమ్ఇండియాను సైతం అతడు గడగడలాడించాడు. భారత్తో మొత్తం 63 మ్యాచ్లాడి 74 వికెట్లు సాధించాడు. దాంతో ఇరు జట్ల మధ్య అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా టాప్లో నిలిచాడు. టీమ్ఇండియాపై సగటు 31.78 కాగా, అత్యుత్తమ గణాంకాలు 7/30గా నమోదయ్యాయి.
చమిందా తర్వాత..
భారత్, శ్రీలంక జట్ల మధ్య మురళీధరన్ తర్వాత అంత గొప్ప గణంకాలు నమోదు చేసింది చమిందా వాస్. ఈ లంక మాజీ పేసర్ తనదైన బౌలింగ్తో ఎన్నో జట్లను ఒంటిచేత్తో చిత్తు చేశాడు. అతడు బౌలింగ్ చేయడానికి వస్తే ఏ బ్యాట్స్మన్ అయినా జాగ్రత్తపడాల్సిందే లేదా పరుగులు చెయ్యడానికి సాహసం చెయ్యాల్సిందే. ఈ క్రమంలోనే టీమ్ఇండియాతో 61 మ్యాచ్లాడిన అతడు 70 వికెట్లు సాధించాడు. దాంతో ఇరు జట్ల మధ్య అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు. భారత్పై అతడి సగటు 31.61గా నమోదవ్వగా అత్యుతమ గణాంకాలు 5/14గా నమోదయ్యాయి.
జహీర్ @ మూడు..
టీమ్ఇండియా పేస్ బౌలింగ్కే వన్నె తెచ్చిన బౌలర్ జహీర్ఖాన్. 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో అధికశాతం ప్రధాన బౌలర్గానే సేవలందించాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా, ఓపెనర్లను బెంబేలెత్తించే బౌలర్గా ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ఈ క్రమంలోనే ఫాస్ట్ బౌలింగ్లో తనదైన ముద్ర వేశాడు. అలా శ్రీలంకతో ఆడిన 48 మ్యాచ్ల్లో జహీర్ 66 వికెట్లు సాధించాడు. దాంతో ఇరు జట్ల మధ్య అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్గా నిలిచాడు. లంకపై అతడి సగటు 32.19గా నమోదవ్వగా, అత్యుత్తమ గణాంకాలు 5/42గా నమోదయ్యాయి.
భజ్జీ ఊరుకుంటాడా..
ఇక టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం లంకపై తన ప్రతాపం చూపించినవాడే. అతడి స్పిన్ మాయాజాలం గురించి అందరికీ తెలిసిందే. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ భారత జట్టుకు ఊరట కలిగించడంలో ముందు వరుసలో ఉంటాడు ఈ ఆఫ్స్పిన్నర్. అలా శ్రీలంకతో ఆడిన 47 మ్యాచ్ల్లో 61 వికెట్లు సాధించాడు. దాంతో జహీర్ తర్వాత టీమ్ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా, మొత్తంగా నాలుగో బౌలర్గా రికార్డులకెక్కాడు. లంకపై భజ్జీ సగటు 26.95గా నమోదవ్వగా, అత్యుత్తమ గణాంకాలు 5/56గా నమోదయ్యాయి.
అగార్కర్ సాధించాడుగా..
శ్రీలంకపై చెలరేగిన మరో టీమ్ఇండియా ఆణిముత్యం అజిత్ అగార్కర్. అతడు ప్రశాంతంగా కనిపిస్తూనే తనదైన దూకుడు చూపించాడు. తొమ్మిదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో లంకపై మొత్తం 25 మ్యాచ్లాడిన ముంబయి పేసర్ 49 వికెట్లతో చెలరేగాడు. దాంతో ఇరు జట్ల మధ్య అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్గా ఇప్పటికీ కొనసాగుతున్నాడు. లంకపై అతడి సగటు 20.61గా నమోదవ్వగా, అత్యుత్తమ గణాంకాలు 5/44గా నమోదయ్యాయి.
* వీరిని గుర్తు చేసుకుంటే భారత యువ పేసర్లు సైతం రాబోయే సిరీసుల్లో రాణించే అవకాశం ఉంది. ఈ పర్యటనకు భువనేశ్వర్ ఒక్కడే అనుభవజ్ఞుడైన బౌలర్గా కనిపిస్తున్నాడు. మరోవైపు కుల్దీప్, చాహల్ వంటి స్పిన్నర్లున్నా లంకతో ఎక్కువ మ్యాచ్లు ఆడిన అనుభవం లేదు. దాంతో వీరు కూడా గత ఛాంపియన్ల నుంచి స్ఫూర్తిపొంది ఈ పర్యటనలో రాణించాలని కోరుకుందాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ