MSD : మళ్లీ ధోనీకే చెన్నై జట్టు పగ్గాలు

టీ20 లీగ్‌లో చెన్నై సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టు నాయకత్వ బాధ్యతలను ..

Updated : 30 Apr 2022 20:08 IST

జడేజా తప్పుకొన్నట్లు ప్రకటించిన యాజమాన్యం

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 లీగ్‌లో చెన్నై సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టు నాయకత్వ బాధ్యతలను మళ్లీ ఎంఎస్ ధోనీకి అప్పగించింది. 15వ సీజన్‌ ప్రారంభానికి రెండు రోజుల ముందు ధోనీ జట్టు పగ్గాలను వదిలేయడంతో రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా నియమించింది. అయితే ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది మ్యాచుల్లో కేవలం రెండింటిలోనే చెన్నై విజయం సాధించింది. మరోవైపు ఆల్‌రౌండర్‌ పాత్రను పోషించడంలో జడేజా పూర్తిగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఎంఎస్ ధోనీకే సారథ్య బాధ్యతలను అప్పగిస్తున్నట్లు జట్టు యాజమాన్యం ప్రకటించింది. 

‘‘ఆటపై దృష్టిసారించేందుకే రవీంద్ర జడేజా కెప్టెన్సీ వదిలేశాడు. అందుకే జట్టును నడిపించాలని ఎంఎస్ ధోనీని కోరాం. నాయకత్వ పగ్గాలను అందుకునేందుకు ఎంఎస్ ధోనీ అంగీకరించాడు. ఇక నుంచి జడేజా తన ఆటపై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తాడు’’ అని జట్టు యాజమాన్యం వెల్లడించింది. నాలుగుసార్లు చెన్నైకి టీ20 లీగ్‌ టైటిల్‌ను అందించిన ధోనీ సీజన్‌ పోటీల ప్రారంభానికి ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకొని జడేజాకు అప్పగించిన విషయం తెలిసిందే. ఆదివారం హైదరాబాద్‌తో చెన్నై తలపడనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని