MS Dhoni Cricket Academy:బెంగళూరులో ధోనీ క్రికెట్‌ అకాడమీ ప్రారంభం

బెంగళూరులో ఎంఎస్​ ధోనీ క్రికెట్ అకాడమీ ప్రారంభమైంది. గేమ్​ ప్లే, ఆర్కా స్పోర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ అకాడమీ ఏర్పాటు చేశాయి. బెంగళూరులోని బిదరహల్లిలో ఏర్పాటు చేసిన ఎంఎస్ ధోనీ అకాడమీలో ఇప్పటికే రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

Published : 13 Oct 2021 17:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బెంగళూరులో ఎంఎస్​ ధోనీ క్రికెట్ అకాడమీ ప్రారంభమైంది. గేమ్​ ప్లే, ఆర్కా స్పోర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ అకాడమీ ఏర్పాటు చేశాయి. బెంగళూరులోని బిదరహల్లిలో ఏర్పాటు చేసిన ఎంఎస్ ధోనీ అకాడమీలో ఇప్పటికే రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయని నిర్వాహకులు పేర్కొన్నారు. నవంబర్ 7 నుంచి అకాడమీలో శిక్షణ ప్రారంభించనున్నారు.

ఐపీఎల్ 2021 కోసం యూఏఈలో ఉన్న ఎంఎస్ ధోనీ.. అకాడమీ ప్రారంభం సందర్భంగా యువ క్రికెటర్లకు ఓ సందేశం పంపాడు. 'అకాడమీని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. యువ క్రికెటర్లకు 360 డిగ్రీలలో శిక్షణ ఇప్పించడమే గాక మంచి టెక్నిక్స్, టెక్నాలజీతో మీ నైపుణ్యాలకు మెరుగులుదిద్దడమే మా ప్రధాన ఉద్దేశం. సుశిక్షితులైన కోచింగ్ బృందం మీకు అన్నివిధాలుగా అత్యుత్తమ శిక్షణను అందిస్తుంది. వెంటనే రిజిస్టర్ చేసుకుని మా అకాడమీలో భాగస్వాములవ్వండి' అని ధోనీ పేర్కొన్నాడు. యువ క్రికెటర్లందరికీ ఓ సలహా కూడా ఇచ్చాడు. ఫలితం కంటే దాని కోసం చేసే ప్రయత్నం చాలా గొప్పదన్నాడు. చిన్న చిన్న విషయాల మీద అవగాహన పెంచుకోవాలన్నాడు. మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ సక్సెస్ అవుతామని మహీ వివరించాడు. మరోవైపు, ఐపీఎల్‌లో ధోనీ సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరో టైటిల్‌పై కన్నేసింది. క్వాలిఫయర్‌-1లో దిల్లీ క్యాపిటల్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్స్‌కు చేరుకుంది. మరి ఈ జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందో లేదో చూడాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని