Fifa worldcup 2022: ఫిఫా ప్రపంచకప్‌లో ధోనీ క్రేజ్‌.. చెన్నై జెర్సీతో బ్రెజిల్‌కు మద్దతు

దోహా స్టేడియంలో టీమ్ఇండియా మిస్టర్‌ కూల్‌ మహేంద్రసింగ్‌ ధోనీ అభిమానుల సందడి కనిపించింది.

Published : 26 Nov 2022 01:46 IST

దోహా: ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా సెర్బియాపై బ్రెజిల్‌ 2-0 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకొన్న బ్రెజిల్‌ ఆటగాడు రిచర్లీసన్‌ జట్టును విజయం వైపుగా నడిపించాడు. ఈ నేపథ్యంలో గురువారం దోహా స్టేడియంలో టీమ్ఇండియా మిస్టర్‌ కూల్‌ మహేంద్రసింగ్‌ ధోనీ అభిమానుల సందడి కనిపించింది. స్టాండ్స్‌లో ఉన్న ఓ భారతీయ అభిమాని చెన్నై జెర్సీతో మ్యాచ్‌కు హాజరయ్యాడు. ఈ మ్యాచ్‌లో  గెలుపునకు తోటి ప్రేక్షకులతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఓ బ్రెజిల్‌ అభిమానితో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఆ సమయంలో ధోనీ పేరుతో ఉన్న జెర్సీని చూపుతూ తన అభిమానాన్ని చాటుకున్నాడు. వీటిని చెన్నై జట్టు ట్విటర్‌లో పంచుకోవడంతో వైరల్‌గా మారాయి. ఈ పోస్ట్‌ ధోనీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సెర్బియాపై విజయం అనంతరం స్విట్జర్లాండ్‌ను ఈ జట్టు ఢీకొట్టనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని