Dhoni: పాక్ పేసర్‌కు ధోనీ గిఫ్ట్‌.. అదేంటోతెలుసా..?

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ మాటిస్తే కచ్చితంగా నిలబెట్టుకుంటాడని చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ మేనేజర్‌ రసెల్‌ రాధాకృష్ణన్‌ అన్నారు...

Updated : 08 Jan 2022 12:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ మాటిస్తే కచ్చితంగా నిలబెట్టుకుంటాడని చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ మేనేజర్‌ రసెల్‌ రాధాకృష్ణన్‌ అన్నారు. తాజాగా మహీ.. పాకిస్థాన్‌ పేసర్‌ రావుఫ్‌కు ఓ అద్భుతమైన బహుమతి ఇచ్చాడు. దీంతో అతడు సంతోషంలో మునిగిపోయాడు. ఈ విషయాన్ని రావుఫ్‌ స్వయంగా ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు.

ధోనీ తన ఏడో నంబర్‌ సీఎస్కే జెర్సీని కానుకగా ఇచ్చాడని చెప్పాడు. తన వ్యక్తిత్వం, గుడ్‌విల్‌తో ఆ జెర్సీ ఇంకా అభిమానుల మన్ననలు పొందుతోందని పాక్‌ పేసర్ అన్నాడు. అలాగే తనకు ఈ గిఫ్ట్‌ అందడంలో సహకరించిన సీఎస్కే జట్టు మేనేజర్ రసెల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడు. ఈ నేపథ్యంలోనే రసెల్‌ రీట్వీట్‌ చేస్తూ ధోనీ మాటిస్తే నిలబెట్టుకుంటాడన్నాడు.

ఈ పాక్‌ పేసర్‌కు ధోనీ అంటే విపరీతమైన ఇష్టం. ధోనీతో కలిసి ఆడే అవకాశం రాకపోయినా రావుఫ్ ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా మహీని కలిశాడు. మ్యాచ్‌ అనంతరం ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు కూడా. ఈ నేపథ్యంలోనే తాజాగా ధోనీ అతడికి తన జెర్సీని బహుమతిగా పంపించి సంతోష పరిచాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని