MS Dhoni : వచ్చే సీజన్‌లో ఆడటంపై ధోనీ ఏమన్నాడంటే..?

ప్రస్తుత టీ20 టోర్నీ సీజన్‌లో చెన్నై చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడుతోంది. అయితే ఇప్పుడందరి మదిలో మెదిలే ప్రశ్న.. చెన్నై సారథి ఎంఎస్ ధోనీ వచ్చే సీజన్‌ ఆడతాడా...? ...

Updated : 21 May 2022 16:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుత టీ20 టోర్నీ సీజన్‌లో చెన్నై చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడుతోంది. అయితే ఇప్పుడందరి మదిలో మెదిలే ప్రశ్న.. చెన్నై సారథి ఎంఎస్ ధోనీ వచ్చే సీజన్‌ ఆడతాడా...? లేదా..?. అయితే దీనిపై రాజస్థాన్‌తో టాస్‌ సందర్భంగా ధోనీ తనదైన శైలిలో స్పందించాడు. ఇప్పటి వరకు ఏమీ అనుకోలేదని, అయితే వచ్చే సీజన్‌లో తిరిగి రావడానికి తీవ్రంగా కృషి చేస్తానని చెప్పాడు. 

‘‘ముంబయి అంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టం. అయితే ఇది చెన్నై అభిమానులకు కాదు. అందుకే వచ్చే ఏడాదైనా చెన్నైలోనూ ఆడాలని ఆశిస్తున్నా. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు వేదికలపై మ్యాచ్‌లను ఆడి అభిమానులకు కృతజ్ఞతలు తెలపాలి. ఇక పోతే ఇది నా చివరి సీజనా..? లేకపోతే వచ్చే ఏడాది అందుబాటులో ఉంటానా? అనేది అతి పెద్ద ప్రశ్న. మనం ఇప్పుడే అంచనా వేయలేం. అయితే తప్పకుండా దాని కోసం గట్టిగా కృషి చేస్తా’’ అని ధోనీ వివరించాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు  పలికిన ధోనీ ఆ తర్వాత టీ20 లీగ్‌కే పరిమితమయ్యాడు. ఈ సీజన్‌కు ముందే తప్పుకుంటాడని వార్తలు వచ్చినప్పటికీ వాటిని పటాపంచలు చేస్తూ తొలి మ్యాచ్‌లోనే అర్ధశతకం నమోదు చేశాడు. చెన్నై జట్టుగా ఓడినప్పటికీ ధోనీ మాత్రం ఫర్వాలేదనిపించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని