Dhoni : సలహాలు ఇచ్చేందుకు ధోని లేడు.. అందుకే వీళ్లు విఫలమవుతున్నారు : దినేశ్ కార్తిక్
ప్రస్తుత భారత జట్టులో మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిలా యువ ఆటగాళ్లను ప్రోత్సహించే ఆటగాళ్లు లేకపోవడంతో.. యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్లు విఫలమవుతున్నారని..
ఇంటర్నెట్ డెస్క్ : ప్రస్తుత భారత జట్టులో మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిలా యువ ఆటగాళ్లను ప్రోత్సహించే ఆటగాళ్లు లేకపోవడంతో.. యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్లాంటి స్పిన్నర్లు విఫలమవుతున్నారని సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తిక్ అన్నాడు. మైదానంలో ధోని ఇచ్చే సలహాలు యువ ఆటగాళ్లకు చాలా ప్రయోజనకరమని పేర్కొన్నాడు. రెండేళ్ల క్రితం వరకు పరిమిత ఓవర్ల క్రికెట్లో కీలకంగా వ్యవహరించిన యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ఇద్దరూ.. ప్రస్తుతం ఫామ్లేమీతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. వారి వైఫల్యానికి గల కారణాలను దినేశ్ కార్తిక్ విశ్లేషించాడు.
‘ధోని అందించిన ప్రోత్సాహంతోనే యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ భారత జట్టులో కీలక స్పిన్నర్లుగా ఎదిగారు. బ్యాటర్లు స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ఆడుతున్నప్పుడూ.. వికెట్ల వెనుక నుంచి ధోని ఇచ్చే సలహాలు వాళ్లిద్దరికీ బాగా ఉపయోగపడేవి. ధోని సలహా మేరకు సరైన లైన్ అండ్ లెంగ్త్లో బంతులేస్తూ వికెట్లు పడగొట్టేవారు. చాలా మ్యాచులకు విరాట్ కోహ్లీ కెప్టెన్గా వ్యవహరించినా.. యువ ఆటగాళ్లకు మాత్రం ధోనినే అమూల్యమైన సూచనలు, సలహాలు ఇచ్చేవాడు. ధోనిపై వారికి అపార నమ్మకం ఉండేది. ఆటగాళ్లెవరైనా మెరుగ్గా రాణిస్తున్నంత కాలం ఎవరూ వేలెత్తి చూపరు. కానీ, 2019 ప్రపంచకప్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. యువ ఆటగాళ్లు పూర్తి స్థాయి క్రికెటర్లుగా ఎదిగేందుకు ధోని అందించిన సహకారం మరువలేనిది’ అని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు.
ఫామ్లేమి కారణంగా గతేడాది ముగిసిన టీ20 ప్రపంచకప్లో కూడా యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్లను పక్కన పెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో యుజ్వేంద్ర చాహల్కు చోటు దక్కినా.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మూడు వన్డేల్లో కలిపి రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కోహ్లి ముఖంలో ఆనందం చూశా
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముఖంలో ఆనందం చూశానని కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. -
సబ్స్టిట్యూట్గా వచ్చి గెలిపించాడు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన తంజిద్ హసన్ (84; 81 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు మెరిపించడంతో సోమవారం ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. -
ఐపీఎల్ ఆరంభంలో పంత్కు కష్టమే
రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రిషబ్ పంత్కు.. ఈ ఐపీఎల్ ఆరంభంలో ఇబ్బందులు తప్పవని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ప్రపంచ రికార్డుతో అఖిల్కు పసిడి
భారత షూటర్ అఖిల్ షెరోన్ అదరగొట్టాడు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం గెలిచిన అతను.. తాజాగా పోలిష్ గ్రాండ్ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. -
సర్ఫరాజ్, జురెల్లకు బీసీసీఐ కాంట్రాక్టులు
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్కీపర్ ధ్రువ్ జురెల్కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించాయి. గ్రూప్-సిలో ఉన్న ఈ ఆటగాళ్లు ఫీజు కింద ఏడాదికి కోటి రూపాయలు పొందుతారు.