mahendra singh dhoni: ధోనీ చేతుల మీదుగా.. ‘డ్రోనీ’ వచ్చేసింది!
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అధునాతన డ్రోన్ను ధోనీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. దీనికి ‘డ్రోనీ’ అని నామకరణం చేశారు.
చెన్నై: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ అనంతరం సేద్యం వైపు అడుగులు వేసిన విషయం తెలిసిందే. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వాడకాన్ని అభివృద్ధి చేస్తున్న గరుడ ఏరోస్పేస్ సంస్థకు ప్రచారకర్తగానూ ఈ మిస్టర్ కూల్ వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అధునాతన డ్రోన్ను ధోనీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. దీనికి ‘డ్రోనీ’ అని నామకరణం చేశారు. పంటపొలాల్లో ఎరువులు చల్లడమే కాకుండా ఇతర సాగు అవసరాలకు వీటిని వినియోగించనున్నారు.
ఈ కార్యక్రమంలో ధోనీ మాట్లాడుతూ.. కరోనా లాక్డౌన్ సమయంలో వ్యవసాయంపై తనకు ఎంతో ఆసక్తి ఏర్పడిందని తెలిపాడు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల ఆవశ్యతను వివరించాడు. తన సొంత రాష్ట్రంలో పది ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ క్రికెట్ లెజెండ్ సేంద్రియ పద్ధతుల్లో వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నాడు. రెండేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అనంతరం ప్రస్తుతం టీ20 లీగ్లో మాత్రమే ఆడుతున్నాడు. గత సీజన్ తొలి నాళ్లలో చెన్నై సారథి బాధ్యతల నుంచి తప్పుకోగా.. జట్టు వరుస వైఫల్యాల కారణంగా తిరిగి కెప్టెన్గా కొనసాగుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్