MS Dhoni: అలాంటి ప్లేయర్లను ‘వేలం’లోనే ఎంచుకుంటాం: ధోనీ
ఐపీఎల్ 2023 సీజన్లో (IPL 2023) ప్లేఆఫ్స్కు చేరిన తొలి రెండు జట్లేవో తేలిపోయాయి. అగ్రస్థానంతో గుజరాత్.. రెండోస్థానంతో ఎంఎస్ ధోనీ (MS Dhoni) సారథ్యంలోని చెన్నై ప్లేఆఫ్స్ బెర్తులను ఖాయం చేసుకున్నాయి. తాజాగా దిల్లీని సీఎస్కే (DC vs CSK) చిత్తుగా ఓడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పన్నెండోసారి ఐపీఎల్ ప్లేఆఫ్స్కు చేరుకుంది. ఐపీఎల్ 2023 సీజన్ (IPL 2023) చివరి లీగ్ మ్యాచ్లో దిల్లీ క్యాపిటల్స్ను సీఎస్కే 77 పరుగుల తేడాతో చిత్తు చేసి మరీ ఘనంగా ప్లేఆఫ్స్లోకి దూసుకెళ్లింది. టాప్ -2లో ఉండటంతో తొలి క్వాలిఫయర్లో మే 23న చెపాక్ వేదికగానే గుజరాత్ టైటాన్స్ను ఢీకొట్టనుంది. గత సీజన్లో లీగ్స్టేజ్కే పరిమితమై పుంజుకోవడం వెనుక ఉన్న సీక్రెట్ను ధోనీ వెల్లడించాడు. బౌలింగ్ దళంలో స్టార్లు లేనప్పటికీ.. యువ బౌలర్లతోనే అద్భుతమైన ఫలితాలను రాబట్టాడు. తమ జట్టుకు సరిపడేవిధంగా ఉన్న ఆటగాళ్లను తీసుకొనేందుకు వేలం ప్రక్రియలో ప్రయత్నిస్తామని ధోనీ తెలిపాడు.
‘‘వేలం ప్రక్రియ సందర్భంగా మేం ఆలోచించేది ఒకటే అంశం. ఫస్ట్ టీమ్.. ఆ తర్వాతే తమ వ్యక్తిగత ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకొనే ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటాం. బయట నుంచి చూస్తే ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎంపిక చేసుకున్న ఆటగాళ్లను తొలుత జట్టు వాతావరణానికి అలవాటుపడేలా చేసేందుకు ప్రయత్నిస్తాం. సక్సెస్కు ఒకటంటూ పద్ధతి లేదు. అత్యుత్తమ ఆటగాళ్లను తీసుకుని వారు ఆడేందుకు తగిన అవకాశాలు ఇవ్వాలి. బలహీనంగా ఉన్న అంశాల్లో మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలి. కొందరు జట్టు కోసం తమ స్థానాన్ని త్యాగం చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో జట్టు మేనేజ్మెంట్ కూడా మాకు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తుంది. ఆటగాళ్లు లేనిదే మనం ఏం చేయలేం. అందుకే వారు చాలా కీలకం. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దేశ్ పాండే అద్భుతంగా పుంజుకున్నాడు. పతిరణ సహజసిద్దమైన బౌలర్’’ అని ధోనీ తెలిపాడు.
50వ మ్యాచ్లో అర్ధశతకం అద్భుతం: రుతురాజ్
దిల్లీపై కేవలం 50 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్ల సాయంతో రుతురాజ్ గైక్వాడ్ 79 పరుగులు చేశాడు. సీఎస్కే విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ‘‘మేం తప్పక గెలవాల్సిన మ్యాచ్. సీఎస్కే తరఫున ఇది నా 50వ మ్యాచ్. ఇలాంటి విజయంలో నా భాగస్వామ్యం ఉండటం ఆనందంగా ఉంది. పేసర్లను బాదడం కంటే స్పిన్ బౌలింగ్ ఆడటం కాస్త సులువుగా అనిపించింది. వికెట్లను అట్టిపెట్టుకుని ఉంటే తర్వాత దూకుడుగా ఆడొచ్చని భావించాం. మా తర్వాత శివమ్ దూబె, జడేజా, ధోనీ ఎలాగూ ఉన్నారు. డేవన్ కాన్వేతో కలిసి ఓపెనింగ్ చేయడం చాలా బాగుంటుంది. ఎలాంటి సమయంలోనైనా మాట్లాడే వెసులుబాటు అతడి వద్ద ఉంటుంది’’ అని చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
ఎప్పుడూ కూల్గా కనిపించే ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని సురేశ్ రైనా ఇటీవల బయటపెట్టాడు. -
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM