MS Dhoni: రాంచీ వీధుల్లో క్రికెటర్లతో కలిసి కొత్త కారులో ధోనీ చక్కర్లు..

మార్కెట్‌లో కొత్తగా ఏ లగ్జరీ వాహనం వచ్చినా తన గ్యారేజీలో చేర్చుతుంటాడు ధోనీ. ఇలా అతడి వద్ద పెద్ద సంఖ్యలో కార్లు, వింటేజ్‌ వాహనాల కలెక్షన్‌ ఉంది.

Updated : 19 Nov 2022 11:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ధోనీకి కార్లు, బైక్‌లు అంటే ఎంతిష్టమో తెలిసిందే. మార్కెట్‌లో కొత్తగా ఏ లగ్జరీ వాహనం వచ్చినా తన గ్యారేజీలో చేర్చుతుంటాడు. ఇలా అతడి వద్ద పెద్ద సంఖ్యలో కార్లు, వింటేజ్‌ వాహనాల కలెక్షనే ఉంది. తాజాగా ఈ ఝార్ఖండ్‌ డైనమైట్‌ ‘కియా ఈవీ6’ కారును కొని ఇంటికి తీసుకొచ్చాడు. పూర్తిస్థాయి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఇది. దీనిలో సరదాగా ధోనీ రైడ్‌కు వెళ్లాడు. తనవెంట రుతురాజ్‌ గైక్వాడ్‌, కేదార్‌ జాదవ్‌నూ ఈ కారులో తీసుకెళ్లి రాంచీ వీధుల్లో చక్కర్లు కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఇక ధోనీ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం భారత టీ20 లీగ్‌లో చైన్నై సారథిగా కొనసాగుతున్నాడు. ఈ జట్టు ఇటీవల తమ వద్ద అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు