MS Dhoni : బర్త్‌డేబాయ్‌ ధోనీ.. ఎక్కడున్నాడో తెలుసా..?

ఇవాళ టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ 41వ జన్మదినం. ఇటువంటి రోజున ధోనీ ఎక్కడున్నాడో తెలుసా..? సన్నిహితులతో కలిసి...

Updated : 07 Jul 2022 11:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇవాళ టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ 41వ జన్మదినం. ఈ రోజు ధోనీ ఎక్కడున్నాడో తెలుసా..? సన్నిహితులతో కలిసి లండన్‌లో వింబుల్డన్‌ మ్యాచ్‌ను వీక్షించాడు. దీనికి సంబంధించిన ఫొటోను వింబుల్డన్‌ నిర్వాహకులు తమ సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. చెన్నై జట్టు తమ ట్విటర్‌ వేదికగా ట్వీట్‌ చేసింది. లండన్‌లోనే బర్త్‌డే బాయ్‌ ధోనీతో సతీమణి సాక్షి కేక్‌ కోయించిన వీడియో అభిమానులను ఆకట్టుకుంది. ఇటీవల రాంచీకి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ ఆయుర్వేద వైద్యుడి వద్ద ధోనీ మోకాలి నొప్పికి వైద్యం చేయించుకొన్నాడని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

వింబుల్డన్‌ క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌ రఫేల్‌ నాదల్‌, టేలర్ ఫ్రిట్జ్‌ మధ్య జరిగింది. ఉత్కంఠభరితంగా దాదాపు నాలుగున్నర గంటలపాటు జరిగిన మ్యాచ్‌లో నాదల్‌ 3-6, 7-5, 3-6, 7-5, 7-6 (10/4) తేడాతో ఫ్రిట్జ్‌పై విజయం సాధించాడు. గాయం కారణంగా మెడికల్ టైమౌట్‌ తీసుకొన్నా ఆఖరికి నాదలే గెలిచాడు. దీంతో సెమీస్‌కు చేరడంతో 23వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేశాడు. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు టీమ్‌ఇండియా మాజీ దిగ్గజం సునిల్ గావస్కర్, ఇంగ్లాండ్‌ ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్‌ డేవిడ్ బెక్‌హామ్‌ కూడా హాజరయ్యారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని