MS Dhoni : బర్త్డేబాయ్ ధోనీ.. ఎక్కడున్నాడో తెలుసా..?
ఇవాళ టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ 41వ జన్మదినం. ఇటువంటి రోజున ధోనీ ఎక్కడున్నాడో తెలుసా..? సన్నిహితులతో కలిసి...
ఇంటర్నెట్డెస్క్: ఇవాళ టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ 41వ జన్మదినం. ఈ రోజు ధోనీ ఎక్కడున్నాడో తెలుసా..? సన్నిహితులతో కలిసి లండన్లో వింబుల్డన్ మ్యాచ్ను వీక్షించాడు. దీనికి సంబంధించిన ఫొటోను వింబుల్డన్ నిర్వాహకులు తమ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. చెన్నై జట్టు తమ ట్విటర్ వేదికగా ట్వీట్ చేసింది. లండన్లోనే బర్త్డే బాయ్ ధోనీతో సతీమణి సాక్షి కేక్ కోయించిన వీడియో అభిమానులను ఆకట్టుకుంది. ఇటీవల రాంచీకి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ ఆయుర్వేద వైద్యుడి వద్ద ధోనీ మోకాలి నొప్పికి వైద్యం చేయించుకొన్నాడని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ రఫేల్ నాదల్, టేలర్ ఫ్రిట్జ్ మధ్య జరిగింది. ఉత్కంఠభరితంగా దాదాపు నాలుగున్నర గంటలపాటు జరిగిన మ్యాచ్లో నాదల్ 3-6, 7-5, 3-6, 7-5, 7-6 (10/4) తేడాతో ఫ్రిట్జ్పై విజయం సాధించాడు. గాయం కారణంగా మెడికల్ టైమౌట్ తీసుకొన్నా ఆఖరికి నాదలే గెలిచాడు. దీంతో సెమీస్కు చేరడంతో 23వ గ్రాండ్స్లామ్పై కన్నేశాడు. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు టీమ్ఇండియా మాజీ దిగ్గజం సునిల్ గావస్కర్, ఇంగ్లాండ్ ఫుట్బాల్ మాజీ కెప్టెన్ డేవిడ్ బెక్హామ్ కూడా హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)