MS Dhoni: ‘అప్పుడే ఏడాదయిందా నమ్మలేకపోతున్నాం’
టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు విరామం ప్ర
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు విరామం ప్రకటించి అప్పుడే ఏడాది గడిచిపోయింది. సరిగ్గా ఏడాది క్రితం (2020 ఆగస్టు 15)న రాత్రి 7 గంటల 29 నిమిషాలకు అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెబుతున్నట్టు ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించి అభిమానులకు షాక్ ఇచ్చాడు ధోనీ. ‘కెరీర్ సాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు.19.29 గంటల నుంచి వీడ్కోలు పలికినట్టుగా భావించండి’ అని ఓ వీడియోని ధోనీ అప్పుడు ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు.
ధోనీ రిటైర్మెంట్ విషయాన్ని గుర్తు చేస్తూ ‘నాయకుడు, దిగ్గజం, స్ఫూర్తిదాయకుడు’ అనే వ్యాఖ్యను జతచేస్తూ ధోనీ ఫొటోని బీసీసీఐ ట్వీట్ చేయగా.. ‘ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి ఒక సంవత్సరం అయ్యిందని నమ్మలేకపోతున్నాం’ అంటూ కెరీర్లో ధోనీ సాధించిన ఘనతలను తెలియజేసే విధంగా ఉన్న ఫొటోని కోల్కతా నైట్రైడర్స్ ట్వీట్ చేసింది.
కెప్టెన్ కూల్గా పేరొందిన ధోనీ..భారత్కు ఎన్నో మరుపురాని విజయాలనందించాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2010, 2016 ఆసియా కప్లు, 2011 ప్రపంచకప్తోపాటు 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలు ధోనీ సారథ్యంలో అందుకున్నవే. 2019 ప్రపంచకప్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీ ఫైనలే ధోనీకి అంతర్జాతీయ చివరి మ్యాచ్. ఇందులో రనౌటయిన ధోనీ తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు