WTC Final: తుది జట్టు అలా ఉండొద్దు.. అప్పటి పొరపాటును మళ్లీ చేయొద్దు: ఎంఎస్కే ప్రసాద్
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC Final) కోసం టీమ్ఇండియా ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. ఈసారైనా గదను గెలుచుకోవాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్కు (WTC Final) చేరిన భారత్ విజేతగా నిలవాలని తీవ్రంగా శ్రమిస్తోంది. జూన్ 7 నుంచి ఆస్ట్రేలియాతో తలపడేందుకు సిద్ధమవుతోంది. తుది జట్టు ఎంపికపై టీమ్ఇండియా మేనేజ్మెంట్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. బౌలింగ్ విభాగంపైనే కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ కీలక సూచనలు చేశాడు. గత ఫైనల్లో చేసిన పొరపాట్లను మరోసారి పునరావృతం చేయొద్దని పేర్కొన్నాడు. కివీస్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ పిచ్ పేస్కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఇద్దరు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగింది. ఇలాంటి నిర్ణయమే టీమ్ఇండియా నష్టం చేసింది. ఇప్పుడు మరోసారి అలా కాకుండా ఉండాలంటే పిచ్ పరిస్థితికి అనుకూలంగా జట్టును ఎంపిక చేయాలని ఎంఎస్కే స్పష్టం చేశారు. అలాగే రిషభ్ పంత్ లేని లోటును తీర్చడం కష్టమేని చెప్పాడు.
ఒకే ప్లాన్తో వెళ్లొద్దు..
గత ఫైనల్ మ్యాచ్కు మనం ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాం. కానీ, వర్షం పడటంతో పిచ్ పరిస్థితి మారిపోయింది. అయినా సరే తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లకు స్థానం కల్పించి కివీస్తో మ్యాచ్ ఆడేశాం. కానీ, ఇప్పుడు మాత్రం ఆసీస్తో తలపడే ఓవల్ పిచ్ కండీషన్ను బట్టి తుది జట్టు ఎంపిక ఉండాలి. ఐదు రోజులపాటు ఎలా ఉంటుందో మనం అంచనా వేయలేం. అందుకే, ఒకే ప్లాన్కు ఫిక్స్ అయిపోకుండా ఉండాలి.
రిషభ్ లేని లోటు స్పష్టం..
లెఫ్ట్ఆర్మ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ గతేడాది ప్రమాదం బారిన పడి కోలుకుంటున్నాడు. ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడటం లేదు. దీంతో అతడి లేని లోటు స్పష్టంగా ఉంది. రిషభ్ను పూరించే ఆటగాడు కష్టమే. రిషభ్ పంత్ కాకుండా మరే ఇతర వికెట్ కీపర్ ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలో సెంచరీలు సాధించలేదు. కానీ, కేఎస్ భరత్ తదుపరి ఛాయిస్. ఇషాన్ కిషన్ కంటే ఇతడే కాస్త బెటర్. టెస్టు మ్యాచ్లో రోజంతా కీపింగ్ చేయగల సత్తా ఉండాలి. అలాంటి ఫిట్గా ఉన్న ఆటగాడినే తీసుకోవాలి.
అదే డిసైడ్ చేస్తుంది..
రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రహానె బ్యాటింగ్పైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఆసీస్ పేస్ బౌలింగ్ను ఎదుర్కొని ఎంత మేర రాణిస్తారనేది చూడాలి. మిచెల్ స్టార్క్, కమిన్స్, హేజిల్వుడ్ను ఆడటం అంత సులువేం కాదు. గిల్ మంచి ఫామ్లో ఉన్నాడు. అన్నిఫార్మాట్లలోనూ శుభ్మన్ గిల్ ఆడగల సమర్థుడు. ఇక భారత బౌలింగ్ విభాగంలోని ఇద్దరు టాప్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీద్ర జడేజాలో ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ఎవరిని పక్కన పెట్టాలనే నిర్ణయం తీసుకోవడం కూడానూ కష్టమే’’ అని ఎంఎస్కే ప్రసాద్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే