Rohit Sharma: రోహిత్ శర్మ ఆ ఫామ్ని ఉపయోగించుకోవాలి: సాబా కరీమ్
సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్-14 సీజన్ రెండో దశలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తన అద్భుతమైన ఫామ్ను ఉపయోగించుకోవాలని భారత మాజీ వికెట్ కీపర్ సాబా కరీమ్ అన్నాడు. రోహిత్ శర్మ బ్యాట్స్మన్గా రాణిస్తే అతనిలో ఆత్మవిశ్వాసం
(Photo:Mumbai IndiansTwitter)
ఇంటర్నెట్ డెస్క్: సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్-14 సీజన్ రెండో దశలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తన అద్భుతమైన ఫామ్ను ఉపయోగించుకోవాలని భారత మాజీ వికెట్ కీపర్ సాబా కరీమ్ అన్నాడు. రోహిత్ శర్మ బ్యాట్స్మన్గా రాణిస్తే అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగి కెప్టెన్గా విజయవంతమవుతాడని పేర్కొన్నాడు. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపుపొందిన రోహిత్ శర్మ.. ముంబయి ఇండియన్స్ను ఐదుసార్లు ఛాంపియన్గా నిలిపాడు.
‘రోహిత్ శర్మ బ్యాటింగ్లో మెరుగుదల అవసరం. అతడి కెప్టెన్సీలో ముంబయి ఇండియన్స్ ఐపీఎల్లో ఐదుసార్లు విజేతగా నిలిచింది. అది వేరే విషయం. ఆ జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లున్నారు. అందుకే రోహిత్ తన ప్రదర్శన గురించి పట్టించుకోలేదు. కానీ, జట్టులో అతడు కీలక బ్యాట్స్మన్. విచిత్రమైన విషయం ఏమిటంటే.. ఐపీఎల్ ప్రారంభమయ్యే ముందు అంతర్జాతీయ క్రికెట్లో మంచి ఫామ్లో ఉంటున్న ఈ ఆటగాడు టోర్నీలో మాత్రం విఫలమవుతున్నాడు’ అని సాబా కరీమ్ అన్నాడు.
‘ఒక ఆటగాడు కెప్టెన్సీకి ఎక్కువ సమయం కేటాయిస్తే బ్యాటింగ్పై దృష్టిపెట్టలేడని భావిస్తా. అయితే, ఒక బ్యాట్స్మన్ కెప్టెన్గా ఉంటే మన ప్రధాన కర్తవ్యం బ్యాటింగ్లో రాణించడమే. రోహిత్ శర్మకు కూడా బ్యాటింగ్లో రాణిస్తే అది అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి కెప్టెన్గా మరింత రాణించేందుకు సహకరిస్తుంది. ఈ ఐపీఎల్లో రోహిత్ శర్మ బ్యాటింగ్ మారుతుందని భావిస్తున్నా’ సాబా కరీమ్ ముగించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా