Mumbai : సగం మంది కుర్రాళ్లే.. ఇక భారమంతా వారిపైనే!
ప్రతిసారీ ఐపీఎల్ సీజన్ వచ్చినప్పుడల్లా కప్ ఎవరి సొంతం చేసుకుంటారనే...
ఐదుసార్లు ఛాంపియన్.. అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీ.. అంబానీల సొంతం... ఇంకేమీ చెప్పనవసరం లేదేమో.. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా ఆ జట్టేమిటో.. ముంబయి.. అన్ని ఫార్మాట్లలో టీమ్ఇండియాను నడిపిస్తోన్న రోహిత్ శర్మనే వరుసగా ఎనిమిదో ఏడాది ముంబయికి నాయకత్వం వహిస్తున్నాడు. అయితే గతేడాది లీగ్ స్టేజ్కే పరిమితమైన ముంబయిని.. టీమ్ఇండియా కెప్టెన్సీ ఉత్తేజంలో ఉన్న రోహిత్ ఈ సారి ఎలా నడిపిస్తాడనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది..
ప్రతిసారీ కొత్త సీజన్ వచ్చినప్పుడల్లా కప్ ఎవరి సొంతం చేసుకుంటారనే చర్చ రావడం సర్వసాధారణం.. అయితే అది ముంబయి, చెన్నై మధ్యే ఆగిపోతుంది. 2018 నుంచి పరిశీలిస్తే ఇది నిజమేనేమో అనేలా ఉన్నాయి గణాంకాలు. గత నాలుగు సీజన్లలో రెండేసి సార్లు ముంబయి (2019,2020), చెన్నై (2018,2021) టైటిల్స్ను నెగ్గాయి. ఈ సారి ముంబయి జట్టులో మార్పులు చోటు చేసుకున్నా.. కీలక ఆటగాళ్లు ఉండటం, పోటీలు జరిగేది ముంబయి, పుణెలోనే కావడం కలిసొచ్చే అంశమే.
జట్టులో కీలక ప్లేయర్లు వీరే..
ముంబయి అనగానే రోహిత్ శర్మ గుర్తుకొస్తాడు. రోహిత్తోపాటు కీరన్ పొలార్డ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలక ఆటగాళ్లు. మెగా వేలంలో ఇషాన్ను భారీ ధరకు దక్కించుకుంది. అలానే పేసర్లు జోఫ్రా ఆర్చర్, టైమల్ మిల్స్, జయ్దేవ్ ఉనద్కత్ ఉన్నారు. బ్యాటింగ్పరంగా చూసుకుంటే.. రోహిత్, ఇషాన్, సూర్యకుమార్, టిమ్ డేవిడ్, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్ పరుగులు చేయగలరు. అయితే వీరిలో తొలి ముగ్గురు తప్పితే మిగతావారిపై పెద్దగా నమ్మకం ఉండకపోవచ్చు. జట్టులోని 25 మందిలో సగం మంది పెద్దగా తెలియని ఆటగాళ్లే. అయితే రంజీ సహా ఇతర దేశవాళీ టోర్నీల్లో రాణించడంతో ముంబయి వారిని కొనుగోలు చేసింది.
ఓపెనర్లు సరే.. మరి ఆల్ రౌండర్లు?
ఛాంపియన్కు ఓపెనింగ్ సమస్య లేదు. రోహిత్ శర్మతో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ను ఆరంభిస్తాడు. అయితే బ్యాకప్ ఓపెనర్ ఎవరనేది జట్టు యాజమాన్యం నిర్ణయించాల్సి ఉంటుంది. గత సీజన్లో ఆల్రౌండర్లు రాణించకపోవడంతో లీగ్ దశకే ముంబయి పరిమితం కావాల్సి వచ్చింది. పాండ్య సోదరులు, కీరన్ పొలార్డ్ విఫలం కావడం ముంబయికి దెబ్బ పడింది. అయితే ఈసారి పాండ్య బ్రదర్స్ లేరు. కీరన్ పొలార్డ్ కూడానూ పెద్దగా రాణించిందేమీ లేదు. ఏ క్షణంలోనైనా మ్యాచ్ను మలుపు తిప్పగల సత్తా పొలార్డ్కు ఉంది. జోఫ్రా ఆర్చర్ కూడా విలువైన పరుగులు చేయగలడు. అలానే ఫాబియన్ అలెన్ హార్డ్ హిట్టరే. ఇక ఆసీస్ ఆటగాడు డానియల్ సామ్స్ ఫాస్ట్ మీడియంతోపాటు బ్యాటింగ్ చేస్తాడు. అయితే విదేశీ ఆటగాళ్లు తుది జట్టులో నలుగురు మాత్రమే ఉండాలనే నిబంధన ఉంది.
బుమ్రా నేతృత్వంలో బౌలింగ్ దాడి
టీమ్ఇండియా ప్రధాన పేస్ బౌలర్ బుమ్రా నేతృత్వంలోనే ముంబయి పేస్ బౌలింగ్ దళం ఉండబోతోంది. బుమ్రా కాకుండా జోఫ్రా ఆర్చర్, జయ్దేవ్ ఉనద్కత్, రీలే మెరెడిత్, మిల్స్, బసిల్ థంపి ఉన్నారు. అయితే స్పిన్ విభాగం కాస్త బలహీనంగా అనిపిస్తోంది. మురుగన్ అశ్విన్, అన్మోల్ ప్రీత్ సింగ్, డేవాల్డ్ బ్రెవిస్ ఉన్నప్పటికీ వీరిలో ఎవరికీనూ అంతర్జాతీయ అనుభవం లేకపోవడం గమనార్హం. అయితే తుది జట్టులో ఎవరు ఉంటారో తెలియాలంటే మ్యాచ్ వరకు ఆగాల్సిందే మరి.
ఈసారైనా అర్జున్కి అవకాశం దక్కేనా?
గత సీజన్లో రూ. 20 లక్షలకు, ఈ సారి రూ. 30 లక్షలకు సొంతం చేసుకున్న క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కుమారుడు అర్జున్ తెందూల్కర్కు ఈ సారైనా మ్యాచ్ ఆడేందుకు అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. 2020-21 సీజన్లో సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో ముంబయి తరఫున హరియాణా మీద అరంగేట్రం చేసిన అర్జున్ మూడు ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ను మాత్రమే తీశాడు. గత సీజన్ మొత్తం రిజర్వ్ బెంచ్కే పరిమితమైన అర్జున్.. నెట్స్లో బౌలింగ్ చేశాడు. అయితే గాయం కారణంగా మధ్యలోనే తప్పుకొన్నాడు. ఇప్పుడు యువ క్రికెటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అర్జున్కు అవకాశం దక్కొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు.
ముంబయి జట్టు : రోహిత్ శర్మ, అన్మోల్ సింగ్, డేవాల్డ్ బ్రెవిస్, రాహుల్ బుద్ది, సూర్యకుమార్ యాదవ్, ఆర్యన్ జుయల్, ఇషాన్ కిషన్, అర్జున్ తెందూల్కర్, డానియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, హృతిక్ షోకీన్, జోఫ్రా ఆర్చర్, కీరన్ పొలార్డ్, మహమ్మద్ అర్షద్ ఖాన్, తిలక్ వర్మ, రమణ్దీప్ సింగ్, సంజయ్ యాదవ్, టిమ్ డేవిడ్, బసిల్ థంపి, బుమ్రా, జయ్దేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రిలే మెరెడిత్, మిల్స్
-ఇంటర్నెట్ డెస్క్, ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు
-
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్