Mumbai : సగం మంది కుర్రాళ్లే.. ఇక భారమంతా వారిపైనే!
ప్రతిసారీ ఐపీఎల్ సీజన్ వచ్చినప్పుడల్లా కప్ ఎవరి సొంతం చేసుకుంటారనే...
ఐదుసార్లు ఛాంపియన్.. అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీ.. అంబానీల సొంతం... ఇంకేమీ చెప్పనవసరం లేదేమో.. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా ఆ జట్టేమిటో.. ముంబయి.. అన్ని ఫార్మాట్లలో టీమ్ఇండియాను నడిపిస్తోన్న రోహిత్ శర్మనే వరుసగా ఎనిమిదో ఏడాది ముంబయికి నాయకత్వం వహిస్తున్నాడు. అయితే గతేడాది లీగ్ స్టేజ్కే పరిమితమైన ముంబయిని.. టీమ్ఇండియా కెప్టెన్సీ ఉత్తేజంలో ఉన్న రోహిత్ ఈ సారి ఎలా నడిపిస్తాడనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది..
ప్రతిసారీ కొత్త సీజన్ వచ్చినప్పుడల్లా కప్ ఎవరి సొంతం చేసుకుంటారనే చర్చ రావడం సర్వసాధారణం.. అయితే అది ముంబయి, చెన్నై మధ్యే ఆగిపోతుంది. 2018 నుంచి పరిశీలిస్తే ఇది నిజమేనేమో అనేలా ఉన్నాయి గణాంకాలు. గత నాలుగు సీజన్లలో రెండేసి సార్లు ముంబయి (2019,2020), చెన్నై (2018,2021) టైటిల్స్ను నెగ్గాయి. ఈ సారి ముంబయి జట్టులో మార్పులు చోటు చేసుకున్నా.. కీలక ఆటగాళ్లు ఉండటం, పోటీలు జరిగేది ముంబయి, పుణెలోనే కావడం కలిసొచ్చే అంశమే.
జట్టులో కీలక ప్లేయర్లు వీరే..
ముంబయి అనగానే రోహిత్ శర్మ గుర్తుకొస్తాడు. రోహిత్తోపాటు కీరన్ పొలార్డ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలక ఆటగాళ్లు. మెగా వేలంలో ఇషాన్ను భారీ ధరకు దక్కించుకుంది. అలానే పేసర్లు జోఫ్రా ఆర్చర్, టైమల్ మిల్స్, జయ్దేవ్ ఉనద్కత్ ఉన్నారు. బ్యాటింగ్పరంగా చూసుకుంటే.. రోహిత్, ఇషాన్, సూర్యకుమార్, టిమ్ డేవిడ్, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్ పరుగులు చేయగలరు. అయితే వీరిలో తొలి ముగ్గురు తప్పితే మిగతావారిపై పెద్దగా నమ్మకం ఉండకపోవచ్చు. జట్టులోని 25 మందిలో సగం మంది పెద్దగా తెలియని ఆటగాళ్లే. అయితే రంజీ సహా ఇతర దేశవాళీ టోర్నీల్లో రాణించడంతో ముంబయి వారిని కొనుగోలు చేసింది.
ఓపెనర్లు సరే.. మరి ఆల్ రౌండర్లు?
ఛాంపియన్కు ఓపెనింగ్ సమస్య లేదు. రోహిత్ శర్మతో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ను ఆరంభిస్తాడు. అయితే బ్యాకప్ ఓపెనర్ ఎవరనేది జట్టు యాజమాన్యం నిర్ణయించాల్సి ఉంటుంది. గత సీజన్లో ఆల్రౌండర్లు రాణించకపోవడంతో లీగ్ దశకే ముంబయి పరిమితం కావాల్సి వచ్చింది. పాండ్య సోదరులు, కీరన్ పొలార్డ్ విఫలం కావడం ముంబయికి దెబ్బ పడింది. అయితే ఈసారి పాండ్య బ్రదర్స్ లేరు. కీరన్ పొలార్డ్ కూడానూ పెద్దగా రాణించిందేమీ లేదు. ఏ క్షణంలోనైనా మ్యాచ్ను మలుపు తిప్పగల సత్తా పొలార్డ్కు ఉంది. జోఫ్రా ఆర్చర్ కూడా విలువైన పరుగులు చేయగలడు. అలానే ఫాబియన్ అలెన్ హార్డ్ హిట్టరే. ఇక ఆసీస్ ఆటగాడు డానియల్ సామ్స్ ఫాస్ట్ మీడియంతోపాటు బ్యాటింగ్ చేస్తాడు. అయితే విదేశీ ఆటగాళ్లు తుది జట్టులో నలుగురు మాత్రమే ఉండాలనే నిబంధన ఉంది.
బుమ్రా నేతృత్వంలో బౌలింగ్ దాడి
టీమ్ఇండియా ప్రధాన పేస్ బౌలర్ బుమ్రా నేతృత్వంలోనే ముంబయి పేస్ బౌలింగ్ దళం ఉండబోతోంది. బుమ్రా కాకుండా జోఫ్రా ఆర్చర్, జయ్దేవ్ ఉనద్కత్, రీలే మెరెడిత్, మిల్స్, బసిల్ థంపి ఉన్నారు. అయితే స్పిన్ విభాగం కాస్త బలహీనంగా అనిపిస్తోంది. మురుగన్ అశ్విన్, అన్మోల్ ప్రీత్ సింగ్, డేవాల్డ్ బ్రెవిస్ ఉన్నప్పటికీ వీరిలో ఎవరికీనూ అంతర్జాతీయ అనుభవం లేకపోవడం గమనార్హం. అయితే తుది జట్టులో ఎవరు ఉంటారో తెలియాలంటే మ్యాచ్ వరకు ఆగాల్సిందే మరి.
ఈసారైనా అర్జున్కి అవకాశం దక్కేనా?
గత సీజన్లో రూ. 20 లక్షలకు, ఈ సారి రూ. 30 లక్షలకు సొంతం చేసుకున్న క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కుమారుడు అర్జున్ తెందూల్కర్కు ఈ సారైనా మ్యాచ్ ఆడేందుకు అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. 2020-21 సీజన్లో సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో ముంబయి తరఫున హరియాణా మీద అరంగేట్రం చేసిన అర్జున్ మూడు ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ను మాత్రమే తీశాడు. గత సీజన్ మొత్తం రిజర్వ్ బెంచ్కే పరిమితమైన అర్జున్.. నెట్స్లో బౌలింగ్ చేశాడు. అయితే గాయం కారణంగా మధ్యలోనే తప్పుకొన్నాడు. ఇప్పుడు యువ క్రికెటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అర్జున్కు అవకాశం దక్కొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు.
ముంబయి జట్టు : రోహిత్ శర్మ, అన్మోల్ సింగ్, డేవాల్డ్ బ్రెవిస్, రాహుల్ బుద్ది, సూర్యకుమార్ యాదవ్, ఆర్యన్ జుయల్, ఇషాన్ కిషన్, అర్జున్ తెందూల్కర్, డానియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, హృతిక్ షోకీన్, జోఫ్రా ఆర్చర్, కీరన్ పొలార్డ్, మహమ్మద్ అర్షద్ ఖాన్, తిలక్ వర్మ, రమణ్దీప్ సింగ్, సంజయ్ యాదవ్, టిమ్ డేవిడ్, బసిల్ థంపి, బుమ్రా, జయ్దేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రిలే మెరెడిత్, మిల్స్
-ఇంటర్నెట్ డెస్క్, ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో లఖ్నవూ 8 వికెట్ల తేడాతో గెలిచింది. 177 పరుగుల లక్ష్యాన్ని లక్నవూ 19 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. -
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?