MIW vs DCW: ముగిసిన ముంబయి ఇన్నింగ్స్.. దిల్లీ లక్ష్యం 110
దిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబయి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 109 పరుగులు చేసింది.
ముంబయి: డబ్ల్యూపీఎల్ (WPL 2023)లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబయి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 109 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (23), పూజా వస్త్రాకర్ (26), వాంగ్ (23), అమన్జోత్ కౌర్ (19) మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. దిల్లీ బౌలర్లలో మరిజన్నె, షిఖా పాండే,జోనాసేన్ తలో 2 వికెట్లు తీయగా.. అరుంధతి రెడ్డి ఒక వికెట్ పడగొట్టారు. ప్రారంభం నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన దిల్లీ జట్టు ముంబయిని స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది.
బ్యాటింగ్ ప్రారంభించిన ముంబయికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు యాస్తికా భాటియా (1), హెయిలీ మ్యాథ్యూస్ (5) తీవ్ర నిరాశపరిచారు. మరిజన్నె వేసిన మూడో ఓవర్ తొలి బంతికే తనియా భాటియాకు క్యాచ్ ఇచ్చి యాస్తికా భాటియా వెనుదిరిగింది. ఆ తర్వాతి బంతికే ఫస్ట్డౌన్లో వచ్చిన బ్రంట్ (0) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్కు చేరింది. జట్టు స్కోరు 10 పరుగుల వద్ద షిఖాపాండే వేసిన నాలుగో ఓవర్ మూడో బంతికి రోడ్రిగ్స్కు క్యాచ్ ఇచ్చి ఓపెనర్ హెయిలీ మ్యాథ్యూస్ ఔటయ్యింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసింది. అమీలా కేర్ (8) కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగింది. ఆ తర్వాత పూజా వస్త్రాకర్, ఓవగ్, అమన్జోత్ కౌర్ మోస్తరు ప్రదర్శన చేయడంతో ముంబయి ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి