Chennai vs Mumbai: చెన్నై x ముంబయి.. ఈరోజు ఓడితే ధోనీసేన ఇంటిముఖమే
భారత టీ20 లీగ్లో అత్యంత గొప్ప జట్లుగా పేరున్న చెన్నై, ముంబయి ఈరోజు మరోసారి తలపడనున్నాయి. ఇప్పటికే ముంబయి ప్లేఆఫ్స్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోగా...
ఇంటర్నెట్డెస్క్: భారత టీ20 లీగ్లో అత్యంత గొప్ప జట్లుగా పేరున్న చెన్నై, ముంబయి నేడు మరోసారి తలపడనున్నాయి. ఇప్పటికే ముంబయి ప్లేఆఫ్స్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోగా.. చెన్నైకి టెక్నికల్గా ఏదో చిన్న అవకాశం ఉంది. అయితే, ఈ రోజు జరిగే మ్యాచ్లో ముంబయి గెలిస్తే.. చెన్నై దారులు కూడా పూర్తిగా మూసుకుపోతాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొందాం..
చెన్నై ఒకటి అలా ఒకటి ఇలా..
ఈ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్లా అడుగుపెట్టిన చెన్నై తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. తొలి నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోయిన తర్వాత ఐదో మ్యాచ్లో విజయం సాధించింది. ఇక అక్కడి నుంచైనా వరుస విజయాలు సాధిస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలిస్తోంది. ఐదో మ్యాచ్లో బెంగళూరుపై తొలి విజయాన్ని సొంతం చేసుకున్న ఆ జట్టు తర్వాత మళ్లీ గెలుపోటములతో దాగుడు మూతలు ఆడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 4 విజయాలతో తొమ్మిదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది.
ఓపెనర్లే కీలకం..
ఇక చెన్నై ఇప్పటి వరకు గెలిచిన నాలుగు మ్యాచ్ల్లో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే.. ఇద్దరే రెండు మ్యాచ్లు గెలిపించారు. సూపర్ ఫామ్లో ఉన్న వీరు ఇటీవల రెండు శతక భాగస్వామ్యాలు జోడించి ఆ జట్టు భారీ స్కోర్లు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా కాన్వే ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనే 77 సగటుతో 231 పరుగులు చేశాడు. అందులో మూడు అర్ధ శతకాలు ఉండటం విశేషం. మరోవైపు టోర్నీ ఆరంభంలో తడబడిన రుతురాజ్ కొద్ది రోజుల నుంచి పుంజుకొన్నాడు. ఈ క్రమంలోనే ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. దీంతో నేటి మ్యాచ్లో ముంబయి వీరిద్దర్నీ కట్టడి చేస్తే సగం మ్యాచ్ గెలిచేసినట్లే. ఓపెనర్ల తర్వాత అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప, శివమ్ దూబే వంటి ఆటగాళ్లు అడపా దడపా భారీ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. అయితే, కెప్టెన్ ధోనీ మాత్రం ఫినిషర్గా చివర్లో దంచికొడుతున్నాడు.
ముంబయి ఆశలు లేకున్నా..
ఇక ముంబయి ఈ టోర్నీ చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణంగా ఆడుతోన్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలే సాధించి అన్నింటికన్నా ముందే ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. అలాంటిది ఇటీవల రాజస్థాన్, గుజరాత్ జట్లపై విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్లో కొనసాగుతున్న వాటికి షాకిచ్చింది. ఈ విజయాలు ముంబయికి ఎలాగూ కలిసిరాకపోయినా ఆ ఫలితాలు ఇతర జట్లపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో నేడు చెన్నైతో జరిగే మ్యాచ్లోనూ ముంబయి గెలిస్తే ధోనీసేన అవకాశాలను పూర్తిగా దెబ్బతీసినట్లే. దీంతో చెన్నై కూడా ప్లేఆఫ్స్కు చేరకుండా ఇంటిముఖం పట్టే వీలుంది.
బుమ్రా ఒక్కడు మెరిస్తే..
ఈ సీజన్లో ముంబయి ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ఏమాత్రం ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే. ఇషాన్ మూడు అర్ధ శతకాలు సాధించినా అవి జట్టు విజయాలకు ఏమాత్రం ఉపయోగపడలేదు. వీరిద్దరి తర్వాత నమ్మకం ఉన్న ఆటగాడు సూర్యకుమార్. అతడు ఈ సీజన్లో బ్యాటింగ్ పరంగా ఫర్వాలేదనిపించినా గాయం కారణంగా ఇటీవలే మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇక ఆ జట్టులో నిలకడగా పరుగులు చేస్తున్న ఆటగాడు తిలక్ వర్మ ఒక్కడే. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్గా తనవంతు పరుగులు చేస్తున్నాడు. మరోవైపు పోలార్డ్, డానియల్ సామ్స్, టిమ్ డేవిడ్ వంటి ఆటగాళ్లు అంతంతమాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై సరిగ్గా ఆడితే.. ముంబయిపై విజయం సాధించడం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే, బౌలింగ్లో బుమ్రాను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంది. ఎందుకంటే గత మ్యాచ్లోనే అతడు 5 వికెట్లతో చెలరేగి ఫామ్లోకి వచ్చాడు. అతడు మరోసారి రాణిస్తే చెన్నైకి కష్టాలు తప్పకపోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్