Cricket News: 72 గంటలు క్రీజులోనే.. రికార్డు సృష్టించిన ముంబయి టీనేజ్ క్రికెటర్!
ముంబయికి చెందిన టీనేజ్ క్రికెటర్ సిద్ధార్థ్ మోహితె వినూత్న ప్రయత్నం చేశాడు. ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకోవాలనే ఉద్దేశంతో.. ఏకంగా 72 గంటల 5 నిమిషాల పాటు...
ఇంటర్నెట్ డెస్క్: ముంబయికి చెందిన టీనేజ్ క్రికెటర్ సిద్ధార్థ్ మోహితె వినూత్న ప్రయత్నం చేశాడు. ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకోవాలనే ఉద్దేశంతో.. ఏకంగా 72 గంటల 5 నిమిషాల పాటు క్రీజులోనే ఉన్నాడు. దీంతో 2015లో 50 గంటల పాటు క్రీజులోనే గడిపి విరాగ్ మానే నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. అతడు బ్యాటింగ్ చేసిన వీడియోను రికార్డు చేసి గుర్తింపు కోసం గిన్నిస్ బుక్ అధికారులకు పంపించారు. ఈ రికార్డు సాధించడంలో పలువురు బౌలర్లు అతడికి మద్దతుగా నిలిచారు. నిబంధనల ప్రకారం ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి బ్రేక్ కూడా తీసుకోవచ్చు.
‘నేను సాధించిన రికార్డు పట్ల చాలా గర్వంగా ఉంది. నాలో ఉన్న ప్రత్యేకతను నిరూపించుకునేందుకే ఈ ప్రయత్నం చేశాను. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లు క్రికెట్ ఆడలేకపోయాను. ఏదైనా విభిన్నంగా చేయాలనే ప్రయత్నంలో ఉండగా.. ఈ ఆలోచన వచ్చింది. శిక్షణ తీసుకునేందుకు చాలా అకాడమీలకు తిరిగాను. ఎంతో మంది కోచ్లను కలిశాను. నా ఆలోచన గురించి వివరించాను. అది సాధ్యమయ్యేది కాదని.. ఎవరూ ముందుకు రాలేదు’ అని సిద్ధార్థ్ మోహితె చెప్పుకొచ్చాడు.
* కోచ్ జ్వాలా సింగ్ ప్రోత్సాహంతోనే..
‘అలా కోచ్ కోసం వెతుకుతున్న సమయంలోనే యశస్వీ జైశ్వాల్కి శిక్షణ ఇచ్చిన జ్వాలా సింగ్ సర్ గురించి తెలిసింది. నా ఆలోచన గురించి విని.. ‘ఎందుకు సాధ్యం కాదో చూద్దాం’ అని శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు’ అని సిద్ధార్థ్ పేర్కొన్నాడు. ‘కరోనా కంటే ముందు సిద్ధార్థ్ ఎంసీసీ ప్రొ-40 లీగ్లో ఆడేవాడు. కరోనా కారణంగా దానికి బ్రేక్ వచ్చింది. ఆ సమయంలో సిద్ధార్థ్ శిక్షణ కోసం వాళ్ల అమ్మ నన్ను సంప్రదించారు. అయితే కారణంగా అన్ని మూతబడిపోయాయి. యువ క్రికెటర్లు చాలా కోల్పోయారు. కాబట్టి, ఏదైనా భిన్నంగా చేయాలనుకునే సిద్ధార్థ్కి శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించాను’ అని కోచ్ జ్వాలా సింగ్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా