800వ వికెట్ ఎలా తీశానంటే..!
అంతర్జాతీయ క్రికెట్లో మహామహులను తన గింగిరాలు తిరిగే బంతులతో బోల్తా కొట్టించిన శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తొలుత పేస్ బౌలర్ అవుదామని అనుకున్నారట. పదమూడేళ్ల వయసులో ఎత్తు ఎక్కువ పెరగడం లేదని తన కోచ్ స్పిన్ బౌలింగ్కు మారమని సలహా ఇచ్చాడని ఆయన...
ఇషాంత్ను షాట్లు ఆడాలని కోరా: ముత్తయ్య మురళీధరన్
(Pic: అశ్విన్ యూట్యూబ్ ఛానల్ నుంచి)
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్లో మహామహులను తన గింగిరాలు తిరిగే బంతులతో బోల్తా కొట్టించిన శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తొలుత పేస్ బౌలర్ అవుదామని అనుకున్నారట. పదమూడేళ్ల వయసులో ఎత్తు ఎక్కువ పెరగడం లేదని తన కోచ్ స్పిన్ బౌలింగ్కు మారమని సలహా ఇచ్చాడని ఆయన చెప్పారు. మొదట ఆఫ్స్పిన్ మాత్రమే వేశానని తర్వాత అన్ని అస్త్రాలు నేర్చుకున్నానని తెలిపారు. టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ‘డీఆర్ఎస్ విత్ అశ్విన్’ షోలో ఆయన తమిళంలో సంభాషించారు.
సుదీర్ఘ ఫార్మాట్లో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ ముత్తయ్య మాత్రమే. ఆయన రికార్డుకు దరిదాపుల్లో ప్రస్తుతం ఎవ్వరూ లేరు. 800వ వికెట్గా ప్రజ్ఞాన్ ఓజాను ఔట్ చేశారు. అప్పుడు మైదానంలో ఏం జరిగిందో ఆయన వివరించారు. ‘ప్రజ్ఞాన్ ఓజాతో నేనేమీ మాట్లాడలేదు. నీరు తాగిన తర్వాత ఇషాంత్తో సరదాగా మాట్లాడాను. ఆఖరి వికెట్ కాబట్టి షాట్లు ఆడాలని సూచించా. నువ్వెంత ప్రయత్నించినప్పటికీ భారత్ గెలవలేదు, కనీసం డ్రా కూడా చేసుకోలేదని చెప్పా. కనీసం నాకు వికెట్ ఇస్తే నేనైనా సంతృప్తి చెందుతాను’ అని చెప్పానన్నారు. అయితే అతడు వికెట్ ఇవ్వకుండా 15 ఓవర్ల వరకు ఆడాడని బదులుగా తాను ప్రజ్ఞాన్ ఓజా వికెట్ దక్కించుకున్నానని వెల్లడించారు.
గాలె వేదికగా జరిగిన ఈ మ్యాచులో మొదటి ఇన్నింగ్స్లో ఆతిథ్య శ్రీలంక 520/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అయితే ఆ తర్వాత మురళీధరన్ 5 వికెట్లతో చెలరేగడంతో భారత్ 276కు పరిమితమై ఫాలో ఆన్ ఆడింది. ఆ ఇన్నింగ్స్లోనూ సచిన్, లక్ష్మణ్ పోరాడినా 338కే కుప్పకూలింది. శ్రీలంక పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖరి వికెట్ కావడంతో ఇషాంత్తో తాను సరదాగా మాట్లాడానని ముత్తయ్య అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్