WTA Tournament : బాడీ షాక్కు గురయ్యింది.. డబ్ల్యూటీఏ టోర్నీ నుంచి తప్పుకుంటున్నా : నవోమి ఒసాకా
ఆస్ట్రేలియా ఓపెన్ డిఫెండింగ్ ఛాంపియన్ నవోమి ఒసాక అనూహ్య నిర్ణయం తీసుకుంది. బాడీ షాక్కు గురవడంతో డబ్ల్యూటీఏ టోర్నమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో...
ఇంటర్నెట్ డెస్క్ : ఆస్ట్రేలియా ఓపెన్ డిఫెండింగ్ ఛాంపియన్ నవోమి ఒసాక అనూహ్య నిర్ణయం తీసుకుంది. బాడీ షాక్కు గురవడంతో డబ్ల్యూటీఏ టోర్నమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో శనివారం జరగాల్సిన సెమీ ఫైనల్ మ్యాచ్కు ఆమె దూరమైంది. దీంతో తన ప్రత్యర్థి వెరోనికా కుదెర్మెతోవా నేరుగా ఫైనల్కి చేరుకుంది. రెండో సీడ్ సిమోనా హాలెప్, కుదెర్మెతోవా మధ్య ఆదివారం ఫైనల్ పోరు జరుగనుంది.
‘కొంత విరామం తర్వాత.. ఇటీవల వెంట వెంటనే కీలక మ్యాచులు ఆడటంతో బాడీ షాక్కు గురయ్యింది. అందుకే టోర్నీ నుంచి తప్పుకుంటున్నాను. మెల్బోర్న్లో టోర్నమెంట్ ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదించాను. టోర్నీ నుంచి వైదొలగడం దురదృష్టకరం. కాస్త విరాయం తీసుకుని.. త్వరలో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ కోసం సిద్ధమవ్వాలి’ అని ఒసాకా పేర్కొంది. జనవరి 17 నుంచి ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభం కానుంది.
* ఫైనల్లోకి బోపన్న జోడీ
అడిలైడ్ ఇంటర్నేషనల్ 1 ఏటీపీ టోర్నమెంట్లో భారత్కు చెందిన రోహన్ బోపన్న - రామ్కుమార్ రామ్నాథన్ జోడీ ఫైనల్కి చేరుకుంది. ఏటీపీ 250 మెన్స్ డబుల్స్ ఈవెంట్లో భాగంగా శనివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో.. బోస్నియా-మెక్సికన్ జోడీ టొమిస్లోవ్ బెరిక్ - శాంటియాగో గొంగాలేజ్లను బోపన్న జోడీ 6-2, 6-4 తేడాతో వరుస సెట్లలో ఓడించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఆదివారం జరగనున్న తుదిపోరులో క్రోయేషియా - బ్రెజిల్ ద్వయం ఇవాన్ డొడిగ్, మార్సెలో మెలోలతో భారత్ జోడీ అమీతుమీ తేల్చుకోనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.