T20 World Cup: భారత్ ఆ నిర్ణయం తీసుకోవడం అతిపెద్ద పొరపాటు: నాసర్ హుస్సేన్
టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో పాకిస్థాన్ మీద టీమ్ఇండియా ఓడిపోయింది. పాక్ మీద కెప్టెన్ కోహ్లీ మినహా.. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్తో...
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో పాకిస్థాన్ మీద టీమ్ఇండియా ఓడిపోయింది. పాక్ మీద కెప్టెన్ కోహ్లీ మినహా.. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్తో సహా అందరూ విఫలమయ్యారు. బౌలింగ్ పరంగానూ రాణించలేదు. న్యూజిలాండ్తోనైనా కీలక ఆటగాళ్లు ఫామ్లోకి వచ్చి టీమ్ఇండియా గెలవాలని యావత్ భారతం ఆకాంక్షించింది. అయితే ఎలాంటి పోరాటం చేయకుండానే ప్రత్యర్థికి తలవంచింది. తొలి మ్యాచ్లో విఫలమైన ఓపెనింగ్ జోడీని టీమ్ఇండియా మేనేజ్మెంట్ మార్చింది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్తో ఇషాన్ కిషన్ను పంపింది. రోహిత్ను వన్డౌన్ బ్యాటర్గా వచ్చాడు. అయితే ఫలితంలో ఎలాంటి మార్పూ రాలేదు. ఇదే కొంప ముంచిందేమోనని అభిమానుల అనుమానం. కివీస్ వరుసగా నాలుగు మ్యాచ్ల్లో గెలిచి సెమీస్కు చేరుకుంది. ఇలాంటి అభిప్రాయాన్నే ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు నాసర్ హుస్సేన్ వ్యక్తం చేశాడు. ఓపెనింగ్ మార్చడమే భారత్ చేసిన అతిపెద్ద పొరపాటని పేర్కొన్నాడు. రాహుల్-రోహిత్ జోడీని విడదీయకుండా ఉండాల్సిందని చెప్పాడు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఇషాన్ను తీసుకొచ్చి ఓపెనింగ్కు పంపడం సరికాదని వివరించాడు.
‘‘టీమ్ఇండియాలో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఇక్కడ కొన్ని సార్లు సెలక్షన్ సమస్యగా మారింది. హార్దిక్ పాండ్య కేవలం బ్యాటర్గా మాత్రమే ఆడుతున్నాడు. జట్టు సమతూకానికి ప్రత్యామ్నాయం కోసం వేరే ఎంపికకు వెళ్లాల్సింది. అలానే ఓపెనర్లు రోహిత్-రాహుల్ను విడగొట్టకుండా ఉంటే బాగుండేది. ఐసీసీ నిర్వహించే పెద్ద టోర్నీల్లో టీమ్ఇండియా బ్రాండ్ క్రికెట్ను నిర్భయంగా ఆడటం లేదు. నేను భారత్ను ఫేవరేట్ జట్టుగా పేర్కొన్నా. ఎందుకంటే వాళ్లు ఇక్కడే ఐపీఎల్ ఆడారు. స్టార్ ప్లేయర్లు ఉన్నారు. భారత్ టాప్ఆర్డర్ చాలా బలంగా ఉంటుంది. అయితే ఒక్కోసారి మిడిలార్డర్లో ఆదుకునే ఆటగాడు కరవుతున్నాడు. ఉదాహరణకు తొలి మ్యాచ్ పాకిస్థాన్తో ఓపెనర్లు ఇద్దరూ స్వల్ప వ్యవధిలో పెవిలియన్కు చేరారు. ఆ తర్వాత కోహ్లీ రాణించినా.. మిగతా వారు చేయూతనివ్వలేదు. అందుకే ఎప్పుడూ ప్లాన్బీ ఉండాలని చెబుతుంటా. ఎవరు ఎప్పుడు దిగాలో దానిపై ప్రణాళికలు వేసుకుంటూ ఉండాలి. అయితే టీమ్ఇండియా వద్ద అదే లేదు’’ అని నాసర్ హుస్సేన్ విశ్లేషించాడు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..