WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. నా తుది జట్టులో జడ్డూ ఉండడు: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్
మరో వారం రోజుల్లో ప్రారంభమయ్యే డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final 2023) మ్యాచ్ కోసం భారత్ - ఆస్ట్రేలియా ఆటగాళ్లు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ ఇరు టీమ్ల నుంచి ‘తుది జట్టు’ను ప్రకటించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC Final) మ్యాచ్ జూన్ 7 నుంచి ప్రారంభం కానుంది. భారత్ - ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య ఈ పోరు జరగనుంది. ఇప్పటికే ఇరు జట్ల కీలక ప్లేయర్లు లండన్లోని ఓవల్ చేరుకుని సాధన మొదలుపెట్టారు. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో అదరగొట్టిన భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్ - రవీంద్ర జడేజా కూడా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఆసీస్ తరఫున నాథన్ లియాన్, టాడ్ మర్ఫీ నాణ్యమైన స్పిన్నర్లు. అయితే, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ మాత్రం తన డ్రీమ్ టెస్టు టీమ్లో ఒకరికి మాత్రమే అవకాశం ఇస్తానని చెప్పాడు. ఇరు జట్లలోని కీలకమైన ఆటగాళ్లతో కూడిన డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టును హుస్సేన్ ప్రకటించాడు. వారిని తీసుకోవడానికిగల కారణాలను వెల్లడించాడు.
‘‘ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఉపఖండంలో కానీ, భారత్లో జరిగితే నా జట్టులో రవీంద్ర జడేజాను ఆరో ఆటగాడిగా ఎంపిక చేసుకుంటా. అయితే, ఇప్పుడు చేయను. ఎందుకంటే ఇంగ్లాండ్లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. బౌలింగ్ ఆల్రౌండర్ అంటే పేస్ బౌలింగ్ వేసే కామెరూన్ గ్రీన్ కీలకమవుతాడు. స్పిన్నర్ విషయానికొస్తే రవిచంద్రన్ అశ్విన్ను తీసుకుంటా. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కూడా చేయగల సమర్థుడు. రోహిత్ శర్మ టాప్ ఆర్డర్ను మాత్రమే కాకుండా నా జట్టును నడిపించే సారథి. రోహిత్ సారథ్యమంటే నాకు చాలా ఇష్టం. శుభ్మన్ గిల్ ఫామ్ను చూస్తే అతడినే తీసుకోవాలి. నా తుది జట్టులో మాత్రం ఉస్మాన్ ఖవాజాకు అవకాశం ఇస్తా. అతడినే రోహిత్కు ఓపెనర్ జోడీగా పంపిస్తా. మిడిలార్డర్లో టాప్ క్లాస్ ప్లేయర్లు మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో ఆడతారు.
కామెరూన్ గ్రీన్ ఆరోస్థానంలో ఉంటాడు. అలెక్స్ క్యారీని వికెట్ కీపర్గా తీసుకుంటా. స్పిన్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్కే నా ఓటు. ఇక పేసర్ల విషయానికొస్తే.. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ ఖాయంగా ఉంటారు. చివరి స్థానంలో గాయపడకుండా ఉంటే బుమ్రానే నా ఫస్ట్ ఛాయిస్. అతడు అందుబాటులో లేకపోవడంతో షమీ వైపు మొగ్గు చూపుతున్నా. షమీ పేస్ కూడా అద్భుతంగా ఉంటుంది’’ అని హుస్సేన్ వివరించాడు.
నాజర్ హుస్సేన్ కలల తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, మహమ్మద్ షమీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..